ETV Bharat / state

కరోనా వ్యాక్సిన్​ రెండో డోసు కోసం బారులుతీరిన జనం - కరోనా వ్యాక్సిన్​ రెండో డోసు కోసం అమీర్​పేట ఆస్పత్రి వద్ద బారులుతీరిన జనం

కరోనా వ్యాక్సిన్​ రెండో డోసు కోసం ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద జనాలు బారులు తీరుతున్నారు. ఈ నెల 12 వరకు ఆన్​లైన్​లో​ స్లాట్​ బుక్​ చేసుకోకుండానే వ్యాక్సిన్ వేస్తుండటంతో అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే అమీర్​పేటలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సిన్​ కోసం జనాలు క్యూ కట్టారు.​

వ్యాక్సిన్​ కోసం బారులు
వ్యాక్సిన్​ కోసం బారులు
author img

By

Published : May 10, 2021, 2:06 PM IST

హైదరాబాద్​ అమీర్​పేటలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ వ్యాక్సిన్​ రెండో డోసు కోసం ప్రజలు బారులుతీరారు. ఈ బుధవారం వరకు ఆన్​లైన్​లో స్లాట్​ బుకింగ్​ లేకుండానే వ్యాక్సిన్​ ఇస్తుండటంతో పెద్దసంఖ్యలో జనాలు ఆరోగ్య కేంద్రానికి తరలివచ్చారు.

ఉదయం నుంచే ఆరోగ్య కేంద్రం వద్ద లైన్లలో నిల్చున్నారు. ఇవాళ సుమారు 350 మందికి టీకా రెండో డోసు ఇవ్వనున్నట్లు ఆస్పత్రి వైద్యాధికారి రేవతి పేర్కొన్నారు. ఇందులో 200 మందికి కొవిషీల్డ్, 150 మందికి కొవాగ్జిన్ టీకాలివ్వనున్నట్లు వివరించారు. వ్యాక్సిన్​ కోసం ప్రజలు పెద్దఎత్తున తరలిరావడంతో స్థానిక పోలీసులు ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

హైదరాబాద్​ అమీర్​పేటలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ వ్యాక్సిన్​ రెండో డోసు కోసం ప్రజలు బారులుతీరారు. ఈ బుధవారం వరకు ఆన్​లైన్​లో స్లాట్​ బుకింగ్​ లేకుండానే వ్యాక్సిన్​ ఇస్తుండటంతో పెద్దసంఖ్యలో జనాలు ఆరోగ్య కేంద్రానికి తరలివచ్చారు.

ఉదయం నుంచే ఆరోగ్య కేంద్రం వద్ద లైన్లలో నిల్చున్నారు. ఇవాళ సుమారు 350 మందికి టీకా రెండో డోసు ఇవ్వనున్నట్లు ఆస్పత్రి వైద్యాధికారి రేవతి పేర్కొన్నారు. ఇందులో 200 మందికి కొవిషీల్డ్, 150 మందికి కొవాగ్జిన్ టీకాలివ్వనున్నట్లు వివరించారు. వ్యాక్సిన్​ కోసం ప్రజలు పెద్దఎత్తున తరలిరావడంతో స్థానిక పోలీసులు ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ఇదీ చూడండి.. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో వైరస్ ప్రభావం తక్కువే...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.