ఇవీ చదవండి : కాంగ్రెస్లోకి సావిత్రి పూలే
నగరంలో పశుపతినాథ్
హైదరాబాద్ గచ్చిబౌలిలో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణమంతా శివకీర్తనలతో మారుమోగింది.
ద్వాదశ జ్యోతిర్లింగాలు, పశుపతినాథ్ నమూనాలయాన్ని ప్రారంభించిన సభాపతి
గచ్చిబౌలిలో బ్రహ్నకుమారీస్ సంస్థ ఆవరణలో మహాశివరాత్రి వేడుకలు మొదలయ్యాయి. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాలు, నేపాల్లోని పశుపతినాథ్ నమూనాలయాన్ని ప్రారంభించారు. భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసిన పోచారం... బ్రహ్మకుమారీస్ చేస్తున్న సేవలను కొనియాడారు. వెయ్యి కోట్లతో వెయ్యేళ్లు ఉండేలా యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నామని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.బ్రహ్మకుమారీ సభ్యులు శివకీర్తనలు పాడుతూ చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ నెల 5వరకు వేడుకలు కొనసాగుతాయి.
ఇవీ చదవండి : కాంగ్రెస్లోకి సావిత్రి పూలే
Note: Script Etv Office