హైదరాబాద్ కాప్రా సర్కిల్ మీర్పేట్ హౌసింగ్ బోర్డు కాలనీలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రచారం నిర్వహించారు. ఆయా కాలనీల్లో ముఖ్య నేతలు, పార్టీ శ్రేణులతో సమన్వయ సమావేశాలు నిర్వహించిన మంత్రి... బస్తీల్లో చాయ్ హోటల్స్ వద్ద జనంతో కలిసి టీ తాగారు.
రోడ్ల పక్కన ఇస్త్రీ చేసుకునే వారు, చిరు వ్యాపారులు, రోడ్డున వెళ్తున్న ప్రయాణికులు, మహిళలను కలిసి తెరాస పార్టీకి ఓట్లు వేయాలని కోరారు. కారు గుర్తుకి ఓటు వేయాలని అభ్యర్థించారు.
జీహెచ్ఎంసీలో తెరాస అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూ... ఈ జీహెచ్ఎంసీ ఎన్నికలను ఇతర రెగ్యులర్ ఎన్నికల్లాగా అషామాషీగా తీసుకోవద్దని కార్యకర్తలకు సూచించారు. ఛాలెంజ్గా తీసుకుని.. ప్రత్యర్థులకు డిపాజిట్ దక్కకుండా చేయాలని సూచించారు.
మీర్పేట డివిజన్ రాజీవ్ గాంధీ నగర్, కైలాస గిరి, నవోదయ నగర్ మురికి వాడల్లో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజలతో కలిసి మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారాలను సూచించారు.
- ఇదీ చూడండి 'భాజపాను గెలిపిస్తే అభివృద్ధి పథం'