తెలంగాణ, హరియాణా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు మరిన్ని ఆక్సిజన్ ఎక్స్ప్రెస్లు నడపనున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాలకు మొత్తం 664 మెట్రిక్ టన్నుల ద్రవరూప ఆక్సిజన్ను చేరవేసినట్లు వెల్లడించింది.
మరో 126 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మార్గమధ్యలో ఉందని పేర్కొంది. తెలంగాణ రాష్ట్రానికి త్వరలోనే ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ చేరుకోనున్నట్లు వెల్లడించింది.
ఇదీ చదవండి: బాల కార్మిక విముక్తి కోసం... పీపుల్ హెల్ప్ చిల్డ్రన్..!