అమీర్పేట్ - హైటెక్ సిటీ మార్గంలో త్వరలో మెట్రో రైల్ సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ మార్గంలో రైళ్లు నడిపేందుకు కమిషన్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ అనుమతిచ్చిందని మెట్రో రైల్ ఎండీ ఎన్.వి.ఎస్.రెడ్డి తెలిపారు. త్వరలోనే సేవలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు.ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సేవలను సాధారణంగానే ప్రారంభించాలని నిర్ణయించారు. మెట్రో సేవలు ప్రారంభించే తేదీలు త్వరలోనే వెల్లడిస్తామని ఎన్.వి.ఎస్. రెడ్డి పేర్కొన్నారు. ఈ మార్గంలో రాకపోకలు ప్రారంభమైతే.. జూబ్లీహిల్స్, అమీర్ పేట మార్గంలో ట్రాఫిక్ భారీగా తగ్గనుంది.
ఇవీ చదవండి :'ఫస్ట్'లో బంగాల్ ఫస్ట్....!