రాష్ట్రంలో 22 జిల్లా జడ్జిల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. జిల్లా జడ్జిల్లో 13 నేరుగా.. మరో 9 సీనియర్ సివిల్ జడ్జిలకు నియామక పరీక్ష ద్వారా పదోన్నతి పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఈ మేరకు మే 2 వరకు సీఎస్ కార్యాలయానికి దరఖాస్తులను సమర్పించాలని ప్రభుత్వం తెలిపింది. కనీసం ఏడేళ్ల అనుభవం ఉన్న న్యాయవాదులు జిల్లా జడ్జి ఉద్యోగానికి అర్హులు.
రాత పరీక్ష, వైవా ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. మరో 9 జిల్లా ఉద్యోగాల పదోన్నతుల ద్వారా భర్తీ చేయనున్నారు. కనీసం ఐదేళ్ల అనుభవం ఉన్న సీనియర్ సివిల్ జడ్జిలను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు నోటిఫికేషన్లో తెలిపారు.
ఈ నెల 27న తెరాస వ్యవస్థాపక దినోత్సవం.. జాతీయ పార్టీ పెడతారా?