పొగాకు ఉత్పత్తులను దిల్లీ నుంచి దిగుమతి చేసుకొని... నగరంలో విక్రయిస్తున్న శివకుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. గుట్టుచప్పుడు కాకుండా అమ్ముతున్న నిందితుడి స్థావరంపై... నార్త్జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. అతని నుంచి 10 లక్షల 40 వేల రూపాయల విలువ గల పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు.
సమగ్ర దర్యాప్తు కోసం షాహినాయత్ గంజ్ పోలీసులకు నిందితుడిని అప్పగించారు. గతంలో శివకుమార్ నూనె, చీరల వ్యాపారం చేశాడని... దానిలో తీవ్ర నష్టం వచ్చిన నేపథ్యంలో దీనిని ఎంచుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి: ఆసుపత్రుల్లో సాధారణ చికిత్సలు.. అగమ్యగోచరమే!