ETV Bharat / state

కొవిడ్‌ కాలంలోనూ మధుమేహం, రక్తపోటు ఔషధాల కొరత

author img

By

Published : Oct 10, 2020, 7:10 AM IST

ఈజేహెచ్​ఎస్​లో భాగంగా హైదరాబాద్​లో నెలకొల్పిన ఓపీ సేవల కేంద్రాల్లో వైద్యులు సూచించిన మందుల్లో 20-30 శాతం మాత్రమే అందుబాటులో ఉంటున్నందున రోగులు అవస్థలు పడుతున్నారు. దీర్ఘకాలిక జబ్బులకు ఉపయోగించే అతి ముఖ్యమైన మందులు లభ్యమవ్వక బయటి దుకాణాల్లో కొనాల్సి వస్తోందని వాపోతున్నారు.

lack of medicines at wellness centres
కొవిడ్‌ కాలంలోనూ మధుమేహం, రక్తపోటు ఔషధాల కొరత

సహకారంతో ఉద్యోగులు, పింఛనుదారులు, పాత్రికేయుల పథకం (ఈజేహెచ్‌ఎస్‌)లో భాగంగా నెలకొల్పిన ఓపీ సేవల కేంద్రాల్లో (వెల్‌నెస్‌ సెంటర్లు) ఔషధాల కొరత వేధిస్తోంది. వైద్యులు సూచించిన మందుల్లో 20-30 శాతం మాత్రమే అందుబాటులో ఉండడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బు, మూత్రపిండాల వైఫల్యం తదితర దీర్ఘకాలిక జబ్బులకు ఉపయోగించే అతి ముఖ్యమైన మందులు కూడా లభ్యం కావడంలేదు. ఇక గత్యంతరం లేక బయటి దుకాణాల్లోనే కొనాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. కరోనా ప్రారంభమయ్యాక మందుల కొరత పెరిగిందని సమాచారం. రాష్ట్రంలోని 12 వెల్‌నెస్‌ సెంటర్లలోనూ ఇదే స్థితి ఉన్నట్లు 'ఈనాడు- ఈటీవీభారత్​' పరిశీలనలో తేలింది.

ఓపీ పెరిగినా... అందని మందులు

ఉద్యోగులు, పింఛనుదారులు, పాత్రికేయులకు ఓపీలో వైద్యుని సంప్రదింపులు, నిర్ధారణ పరీక్షలు, ఔషధాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం 2016లో తొలిసారిగా ఖైరతాబాద్‌లో వెల్‌నెస్‌ సెంటర్‌ను ప్రారంభించింది.ఆ తర్వాత రెండేళ్లలోనే రాష్ట్రంలో మరో 11 కేంద్రాలను నెలకొల్పింది. వీటికి క్రమేణా విశేష ఆదరణ లభించింది. రోజుకు సగటున 200-600 మంది వరకు రోగులు వస్తుంటారు. అత్యధికంగా ఖైరతాబాద్‌ కేంద్రానికి వస్తుంటారు. కొవిడ్‌ సమయంలో ఓపీకి వచ్చే వారి సంఖ్య తగ్గింది. జులై, ఆగస్టుల్లో సాధారణ సేవలు ప్రారంభం కావడంతో మళ్లీ పుంజుకుంది. ఇప్పుడు రోజూ 200-300 మంది వరకు వస్తున్నారు. ఇదే సమయంలో ఔషధ నిల్వలు కూడా తగ్గుముఖం పట్టాయి. వైద్యుడు 10 రకాల మందులు సూచిస్తే.. 2-3 రకాలవి మాత్రమే లభ్యమవుతున్నాయి. దీంతో వెల్‌నెస్‌ సెంటర్లకొచ్చే రోగుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు రోజుకు 40-100 మంది మాత్రమే వస్తుండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

మూణ్నెల్లుగా మరీ దుర్భరం

ఔషధాల కొరత మూణ్నెల్లుగా మరీ తీవ్రంగా మారినట్లుగా తెలుస్తోంది. అవసరాలకు తగ్గట్లుగా మందులను నిల్వ చేయాల్సి ఉండగా..అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. వైద్యునితో సంప్రదింపుల అనంతరం నెలకు సరిపడా మందులివ్వాల్సి ఉండగా..అందుబాటులో ఉన్న మందుల్లోనూ 10-15 రోజులకు మాత్రమే ఇస్తున్నారు. గతంలో సుమారు 150-200 రకాల ఔషధాల నిల్వలుండగా.. ఇప్పుడు 60-70 శాతం ఔషధాలు అందుబాటులో లేవని చేతులెత్తేస్తున్నారు. దాంతో దూర ప్రాంతాల నుంచి వైద్యం కోసం వచ్చేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

జాడ లేని స్పెషలిస్టు వైద్యులు

ఒక్కో వెల్‌నెస్‌ సెంటర్‌లో ఓపీ సేవలందించేందుకు 15 మంది స్పెషలిస్టు, సూపర్‌ స్పెషలిస్టు వైద్యులను నియమించుకోవడానికి ప్రభుత్వం అనుమతించినా.. నేటికీ నియామక ప్రక్రియ ముందుకు సాగలేదు. ఖైరతాబాద్‌, వనస్థలిపురం, వరంగల్‌ వంటి కొన్ని కేంద్రాల్లో జనరల్‌ మెడిసిన్‌, ఆర్థోపెడిక్స్‌, గైనకాలజీ తదితర మూణ్నాలుగు స్పెషాలిటీ విభాగాల్లో మాత్రమే సేవలు లభిస్తుండగా..మిగిలిన కేంద్రాల్లో ఎంబీబీఎస్‌ వైద్యులతోనే నెట్టుకొస్తున్నారు.

ఎక్కడెక్కడ ఉన్నాయి?

ఖైరతాబాద్‌, వనస్థలిపురం, హన్మకొండ, సంగారెడ్డి, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ, సిద్దిపేట, ఖమ్మం, కూకట్‌పల్లి, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌.

రెండున్నర ఏళ్లుగా ఖాళీగా సీఈఓ పోస్టు

వెల్‌నెస్‌ సెంటర్ల బాగోగులు చూడటంలో ఉన్నత స్థాయిలో అధికారుల పర్యవేక్షణ కొరవడింది. ఉద్యోగులు, పాత్రికేయుల ఆరోగ్య పథకానికి రెండున్నర సంవత్సరాలుగా పూర్తి స్థాయి ముఖ్య కార్య నిర్వహణాధికారి (సీఈఓ) లేకపోవడం గమనార్హం. 2018 మార్చిలో అప్పటి సీఈఓను బదిలీ చేసి, ఆ స్థానంలో కొత్తవారిని నియమించలేదు. ఈజేహెచ్‌ఎస్‌ బాధ్యతలను కూడా ఆరోగ్యశ్రీ పథకం సీఈఓకే అప్పగించారు. కొద్ది నెలల కిందట ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్‌ఎస్‌ పథకాలను పర్యవేక్షిస్తున్న ఐఏఎస్‌ అధికారి కూడా బదిలీ కావడంతో.. ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శే ఆ బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు.

ఇదీ చదవండిః నిరుద్యోగ భృతి ఊసే ఎత్తడం లేదు: జీవన్​రెడ్డి

సహకారంతో ఉద్యోగులు, పింఛనుదారులు, పాత్రికేయుల పథకం (ఈజేహెచ్‌ఎస్‌)లో భాగంగా నెలకొల్పిన ఓపీ సేవల కేంద్రాల్లో (వెల్‌నెస్‌ సెంటర్లు) ఔషధాల కొరత వేధిస్తోంది. వైద్యులు సూచించిన మందుల్లో 20-30 శాతం మాత్రమే అందుబాటులో ఉండడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బు, మూత్రపిండాల వైఫల్యం తదితర దీర్ఘకాలిక జబ్బులకు ఉపయోగించే అతి ముఖ్యమైన మందులు కూడా లభ్యం కావడంలేదు. ఇక గత్యంతరం లేక బయటి దుకాణాల్లోనే కొనాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. కరోనా ప్రారంభమయ్యాక మందుల కొరత పెరిగిందని సమాచారం. రాష్ట్రంలోని 12 వెల్‌నెస్‌ సెంటర్లలోనూ ఇదే స్థితి ఉన్నట్లు 'ఈనాడు- ఈటీవీభారత్​' పరిశీలనలో తేలింది.

ఓపీ పెరిగినా... అందని మందులు

ఉద్యోగులు, పింఛనుదారులు, పాత్రికేయులకు ఓపీలో వైద్యుని సంప్రదింపులు, నిర్ధారణ పరీక్షలు, ఔషధాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం 2016లో తొలిసారిగా ఖైరతాబాద్‌లో వెల్‌నెస్‌ సెంటర్‌ను ప్రారంభించింది.ఆ తర్వాత రెండేళ్లలోనే రాష్ట్రంలో మరో 11 కేంద్రాలను నెలకొల్పింది. వీటికి క్రమేణా విశేష ఆదరణ లభించింది. రోజుకు సగటున 200-600 మంది వరకు రోగులు వస్తుంటారు. అత్యధికంగా ఖైరతాబాద్‌ కేంద్రానికి వస్తుంటారు. కొవిడ్‌ సమయంలో ఓపీకి వచ్చే వారి సంఖ్య తగ్గింది. జులై, ఆగస్టుల్లో సాధారణ సేవలు ప్రారంభం కావడంతో మళ్లీ పుంజుకుంది. ఇప్పుడు రోజూ 200-300 మంది వరకు వస్తున్నారు. ఇదే సమయంలో ఔషధ నిల్వలు కూడా తగ్గుముఖం పట్టాయి. వైద్యుడు 10 రకాల మందులు సూచిస్తే.. 2-3 రకాలవి మాత్రమే లభ్యమవుతున్నాయి. దీంతో వెల్‌నెస్‌ సెంటర్లకొచ్చే రోగుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు రోజుకు 40-100 మంది మాత్రమే వస్తుండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

మూణ్నెల్లుగా మరీ దుర్భరం

ఔషధాల కొరత మూణ్నెల్లుగా మరీ తీవ్రంగా మారినట్లుగా తెలుస్తోంది. అవసరాలకు తగ్గట్లుగా మందులను నిల్వ చేయాల్సి ఉండగా..అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. వైద్యునితో సంప్రదింపుల అనంతరం నెలకు సరిపడా మందులివ్వాల్సి ఉండగా..అందుబాటులో ఉన్న మందుల్లోనూ 10-15 రోజులకు మాత్రమే ఇస్తున్నారు. గతంలో సుమారు 150-200 రకాల ఔషధాల నిల్వలుండగా.. ఇప్పుడు 60-70 శాతం ఔషధాలు అందుబాటులో లేవని చేతులెత్తేస్తున్నారు. దాంతో దూర ప్రాంతాల నుంచి వైద్యం కోసం వచ్చేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

జాడ లేని స్పెషలిస్టు వైద్యులు

ఒక్కో వెల్‌నెస్‌ సెంటర్‌లో ఓపీ సేవలందించేందుకు 15 మంది స్పెషలిస్టు, సూపర్‌ స్పెషలిస్టు వైద్యులను నియమించుకోవడానికి ప్రభుత్వం అనుమతించినా.. నేటికీ నియామక ప్రక్రియ ముందుకు సాగలేదు. ఖైరతాబాద్‌, వనస్థలిపురం, వరంగల్‌ వంటి కొన్ని కేంద్రాల్లో జనరల్‌ మెడిసిన్‌, ఆర్థోపెడిక్స్‌, గైనకాలజీ తదితర మూణ్నాలుగు స్పెషాలిటీ విభాగాల్లో మాత్రమే సేవలు లభిస్తుండగా..మిగిలిన కేంద్రాల్లో ఎంబీబీఎస్‌ వైద్యులతోనే నెట్టుకొస్తున్నారు.

ఎక్కడెక్కడ ఉన్నాయి?

ఖైరతాబాద్‌, వనస్థలిపురం, హన్మకొండ, సంగారెడ్డి, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ, సిద్దిపేట, ఖమ్మం, కూకట్‌పల్లి, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌.

రెండున్నర ఏళ్లుగా ఖాళీగా సీఈఓ పోస్టు

వెల్‌నెస్‌ సెంటర్ల బాగోగులు చూడటంలో ఉన్నత స్థాయిలో అధికారుల పర్యవేక్షణ కొరవడింది. ఉద్యోగులు, పాత్రికేయుల ఆరోగ్య పథకానికి రెండున్నర సంవత్సరాలుగా పూర్తి స్థాయి ముఖ్య కార్య నిర్వహణాధికారి (సీఈఓ) లేకపోవడం గమనార్హం. 2018 మార్చిలో అప్పటి సీఈఓను బదిలీ చేసి, ఆ స్థానంలో కొత్తవారిని నియమించలేదు. ఈజేహెచ్‌ఎస్‌ బాధ్యతలను కూడా ఆరోగ్యశ్రీ పథకం సీఈఓకే అప్పగించారు. కొద్ది నెలల కిందట ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్‌ఎస్‌ పథకాలను పర్యవేక్షిస్తున్న ఐఏఎస్‌ అధికారి కూడా బదిలీ కావడంతో.. ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శే ఆ బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు.

ఇదీ చదవండిః నిరుద్యోగ భృతి ఊసే ఎత్తడం లేదు: జీవన్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.