సింగరేణి కార్మికులకు 30 శాతం బోనస్ ఇస్తారని భావిస్తే ప్రభుత్వం 28 శాతం మాత్రమే ప్రకటించిందని భాజపా రాష్ట్ర అధ్యక్షులు కె.లక్ష్మణ్ మండిపడ్డారు. కేసీఆర్ విధానాల వల్ల సింగరేణి ఆర్థిక సంక్షోభంలో పడనుందన్నారు. ఆర్టీసీ, విద్యుత్ రంగాలనే కాదు... మొత్తం రాష్ట్రాన్నే అప్పుల ఊబిలోకి నెట్టుతున్నారని ఆరోపించారు. సంస్థలో వారసత్వ ఉద్యోగాలు కల్పించకుండా కేసీఆర్ కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటప్పుడు వారసత్వ రాజకీయాలేందుకని ప్రశ్నించారు. సింగరేణికి చెల్లించే ప్రతి రూపాయిలో 49 శాతం కేంద్ర ప్రభుత్వానిదేనని లక్ష్మణ్ వెల్లడించారు.
ఇవీచూడండి: వచ్చే నెలలో ఇందూరు వస్తా: సీఎం కేసీఆర్