హైదరాబాద్ బాలానగర్లోని నేషనల్ ఇన్స్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యూకేషన్ ఆధ్వర్యంలో డాక్టర్లు సమావేశం నిర్వహించారు. కొవిడ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ నడుస్తున్నాయని నైపర్ డైరెక్టర్ డా.శశిబాల సింగ్ వెల్లడించారు.
ఈ మందు కరోనా సోకిన వ్యక్తులకు వ్యాధి నుంచి నివారించేందుకు ఉపయోగపడుతుందని.. మరో రెండు మూడు నెలల్లోనే దీనిని మార్కెట్లో విడుదల చేస్తామని శశిబాల ఆశాభావం వ్యక్తం చేశారు. టీకా ద్వారా ఎవరికీ.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవి పేర్కొన్నారు.
సమాజ పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్నామని.. వైరస్ అరికట్టేందుకు తమ వంతు ప్రయత్నంగా మందును కనిపెడుతున్నామని సుప్రీం పరిశ్రమ ఎండీ, డాక్టర్ కేశవ్దేవ్ తెలిపారు. అందరి సమష్టి కృషితో నాణ్యతతో కూడిన వ్యాక్సిన్ను విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు.
ఇదీ చదవండి: నూతన రెవెన్యూ చట్టం ఆరంభం మాత్రమే: కేసీఆర్