ETV Bharat / state

పార్లమెంట్​ భవనానికి అంబేడ్కర్​ పేరు పెట్టాలి : జాజుల

author img

By

Published : Dec 22, 2020, 6:33 PM IST

కేంద్రప్రభుత్వ రంగసంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమసంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్​, అసెంబ్లీ భవనాలకు అంబేద్కర్​, పూలే పేర్లు పెట్టాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్​ మింట్​ కాంపౌండ్​లోని స్ఫూర్తిభవన్​లో మాజీ కేంద్రమంత్రి వెంకటస్వామి, మాలమహనాడు వ్యవస్థాపక అధ్యక్షుడు పీవీరావుల వర్ధంతి సభ నిర్వహించారు.

new Parliament building should be named  Ambedkar demand by jajula srinivas goud
పార్లమెంట్​ భవనానికి అంబేడ్కర్​ పేరు పెట్టాలి : జాజుల

మాజీ కేంద్రమంత్రి వెంకటస్వామి, మాలమహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు పీవీరావుల జీవిత చరిత్రలను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని రాష్ట్ర బీసీ సంక్షేమసంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య ఆధ్వర్యంలో స్ఫూర్తిభవన్​లో వర్ధంతి సభను నిర్వహించారు. పేద వర్గాల కోసం పోరాడిన వారి జయంతి, వర్ధంతులను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు.

నూతన పార్లమెంట్​, అసెంబ్లీ భవనాలకు అంబేడ్కర్​, పూలే పేర్లు పెట్టాలని డిమాండ్​ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రైవేటు ఉద్యోగాలలో రిజర్వేషన్లు తీసుకురావాలన్నారు. రిజర్వేషన్లను హరించేందుకే కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారని జాజుల ఆరోపించారు. 2023 నాటికి బీసీలకు రాజకీయ వేదిక ఏర్పాటు కోసం కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఓటు మనదే- సీటు మనదే అనే నినాదంతో అధికారమే లక్ష్యంగా పని చేస్తామని మాలమహనాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య పేర్కొన్నారు.

ఇదీ చూడండి:'ఆర్‌బీఐ అనుమతి లేకుండానే మైక్రో ఫైనాన్స్ సంస్థల నిర్వహణ'

మాజీ కేంద్రమంత్రి వెంకటస్వామి, మాలమహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు పీవీరావుల జీవిత చరిత్రలను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని రాష్ట్ర బీసీ సంక్షేమసంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య ఆధ్వర్యంలో స్ఫూర్తిభవన్​లో వర్ధంతి సభను నిర్వహించారు. పేద వర్గాల కోసం పోరాడిన వారి జయంతి, వర్ధంతులను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు.

నూతన పార్లమెంట్​, అసెంబ్లీ భవనాలకు అంబేడ్కర్​, పూలే పేర్లు పెట్టాలని డిమాండ్​ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రైవేటు ఉద్యోగాలలో రిజర్వేషన్లు తీసుకురావాలన్నారు. రిజర్వేషన్లను హరించేందుకే కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారని జాజుల ఆరోపించారు. 2023 నాటికి బీసీలకు రాజకీయ వేదిక ఏర్పాటు కోసం కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఓటు మనదే- సీటు మనదే అనే నినాదంతో అధికారమే లక్ష్యంగా పని చేస్తామని మాలమహనాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య పేర్కొన్నారు.

ఇదీ చూడండి:'ఆర్‌బీఐ అనుమతి లేకుండానే మైక్రో ఫైనాన్స్ సంస్థల నిర్వహణ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.