ETV Bharat / state

కరోనాపై దేశంలోనే అతి చిన్న పసికందు విజయం

దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన పసికందు కరోనాను జయించాడు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొంది నేడు డిశ్చార్జ్ అయ్యాడు. విషయం తెలుసుకున్న ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ హర్షం వ్యక్తం చేశారు.

author img

By

Published : Apr 29, 2020, 11:42 PM IST

ఈ పసికందు మృత్యుంజయుడు
ఈ పసికందు మృత్యుంజయుడు

దేశంలోనే అతి పిన్న వయస్కుడైన 45 రోజుల పసికందు కరోనాని జయించాడు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఈ చిన్నారికి 23 రోజుల వయసున్నప్పుడు పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు గుర్తించారు. తండ్రి నుంచి బాలుడికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారించారు. ఈ క్రమంలో చిన్నారికి గాంధీలో చికిత్స అందించారు. చిన్నారికి మరోసారి నిర్వహించిన పరీక్షలో నెగెటివ్ రావడం వల్ల వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఆ చిన్నారి సహా మొత్తం 13 మంది పిల్లలు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

దేశంలోనే అతి పిన్న వయస్కుడైన 45 రోజుల పసికందు కరోనాని జయించాడు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఈ చిన్నారికి 23 రోజుల వయసున్నప్పుడు పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు గుర్తించారు. తండ్రి నుంచి బాలుడికి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారించారు. ఈ క్రమంలో చిన్నారికి గాంధీలో చికిత్స అందించారు. చిన్నారికి మరోసారి నిర్వహించిన పరీక్షలో నెగెటివ్ రావడం వల్ల వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఆ చిన్నారి సహా మొత్తం 13 మంది పిల్లలు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

ఇవీ చూడండి : రాష్ట్రంలో కొత్తగా మరో 7 కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.