భాజపా శాసనసభ్యుడు చెందిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీరామనవమి సందర్భంగా చేపట్టే శోభయాత్రకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని రాముడుగా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని రావణాసురుడిగా ఆయన అభివర్ణించారు. రావణాసురుడు ప్రతీ గల్లీలో తిష్టవేశాడని విమర్శించారు. 2019 ఎన్నికల్లో మోదీ దేశమంతా తిరుగుతూ రావణాసురున్ని అంతమొందించి దేశ ప్రధాని అవుతారని రాజాసింగ్ అన్నారు. ప్రజలంతా శోభయాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఇవీ చూడండి: 'పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తాం'