ETV Bharat / state

MLA Muthireddy Takes Charge As TSRTC Chairman : టీఎస్​ఆర్టీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 8, 2023, 6:30 PM IST

MLA Muthireddy Takes Charge As TSRTC Chairman : హైదరాబాద్‌లో బస్‌భవన్‌లో ఆర్టీసీ నూతన ఛైర్మన్‌గా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. నమ్మకంతో రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలను సమర్ధంగా నిర్వహించి.. సంస్థ అభివృద్ధికి పాటుపడతానని ఆర్టీసీ ఛైర్మన్‌ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. సమష్టిగా పనిచేసి సంస్థను లాభాలబాటవైపునకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తానని చెప్పారు.

MLA Muthireddy Takes Charge As TSRTC Chairman
MLA Muthireddy

MLA Muthireddy Takes Charge As TSRTC Chairman : తనపై నమ్మకంతో ప్రభుత్వం ఆర్టీసీ ఛైర్మన్(RTC Chairman) బాధ్యతను అప్పగించిందని.. తన శక్తి మేరకు సంస్థ వృద్ధికి పాటుపడతానని టీఎస్​ఆర్టీసీ ఛైర్మన్ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పేర్కొన్నారు. సంస్థ ఉద్యోగులతో పాటు తాను ఒకరిగా సమష్టిగా పని చేసి ఆర్టీసీ అభివృద్ధికి తోడ్పడుతానని చెప్పారు. సమష్టి కృషితో సంస్థను లాభాల బాటవైపునకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తానని తెలిపారు. టీఎస్ఆర్టీసీ ఛైర్మన్​గా తనను నియమించిన సీఎం కేసీఆర్​కు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.

TSRTC New Chairman MLA Muthireddy Yadagiri Reddy : టీఎస్ఆర్టీసీ నూతన చైర్మన్​గా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్​లోని ఆర్టీసీ బస్ భవన్​లోని తన ఛాంబర్​లో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఛైర్మన్ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి(Muthireddy Yadagiri Reddy) మాట్లాడారు. అనుభవుజ్ఞులైన ఎండీ సజ్జనార్(TSRTC MD Sajjanar) నేతృత్వంలో టీఎస్ఆర్టీసీ అన్ని విభాగాల్లో దూసుకుపోతోందని అన్నారు. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి సంస్థ ఎండీ వీసీ సజ్జనార్, ఇతర ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలియజేసి సన్మానించారు. అయితే జనగామ ఎమ్మెల్యే టికెట్‌ను సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కాకుండా పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఇవ్వాలని సీఎం కేసీఆర్‌(CM KCR) నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ముత్తిరెడ్డిని బుజ్జగించడానికి.. ఆర్టీసీ ఛైర్మన్‌ పదవిని ఆయనకు కట్టబెట్టినట్లు తెలుస్తోంది.

MLA Mutthireddy Fires on Palla : పల్లా భూ కబ్జాలన్నీ ఆధారాలతో సహా నిరూపిస్తా: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

MLA Muthireddy Yadagiri Reddy New Post : శాసనసభ ఎన్నికలు(Telangana Assembly Elections) సమీపిస్తున్న వేళ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నలుగురు నేతలకు నామినేటెడ్ పదవులు(CM KCR Appoints Naminated Posts) అప్పగించిన విషయం విధితమే. టికెట్లు ఇవ్వని ఇద్దరు ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తాటికొండ రాజయ్యకు కార్పొరేషన్ పదవులు కట్టబెట్టారు. కాంగ్రెస్‌ను వీడి బుధవారం బీఆర్‌ఎస్‌లో చేరిన నందికంటి శ్రీధర్‌తో పాటు ఇటీవల పార్టీలో చేరిన ఉప్పల వెంకటేశ్‌ గుప్తాకు కూడా నామినేటెడ్ పోస్టులు కేటాయించారు.

రాష్ట్ర రైతుబంధు సమితి(Rythumandhu Samiti) ఛైర్మన్‌గా స్టేషన్ ఘన్​పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఆర్టీసీ ఛైర్మన్‌గా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని నియమించారు. మిషన్ భగీరథ వైస్ ఛైర్మన్‌గా ఉప్పల వెంకటేశ్ గుప్తాను, ఎంబీసీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నందికంటి శ్రీధర్‌లను నియమించారు. ఈ మేరకు నలుగురికి పదవులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా.. వీరంతా రెండేళ్ల పాటు పదవిలో ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

MLA Rajaiah Muthireddy New Posts : రాజయ్యకు రైతు బంధు సమితి.. ముత్తిరెడ్డికి ఆర్టీసీ

MLA Mutthireddy Fires On MLC Palla Rajeswerreddy : 'పల్లా రాజేశ్వర్​ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి'

MLA Muthireddy Takes Charge As TSRTC Chairman : తనపై నమ్మకంతో ప్రభుత్వం ఆర్టీసీ ఛైర్మన్(RTC Chairman) బాధ్యతను అప్పగించిందని.. తన శక్తి మేరకు సంస్థ వృద్ధికి పాటుపడతానని టీఎస్​ఆర్టీసీ ఛైర్మన్ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పేర్కొన్నారు. సంస్థ ఉద్యోగులతో పాటు తాను ఒకరిగా సమష్టిగా పని చేసి ఆర్టీసీ అభివృద్ధికి తోడ్పడుతానని చెప్పారు. సమష్టి కృషితో సంస్థను లాభాల బాటవైపునకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తానని తెలిపారు. టీఎస్ఆర్టీసీ ఛైర్మన్​గా తనను నియమించిన సీఎం కేసీఆర్​కు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.

TSRTC New Chairman MLA Muthireddy Yadagiri Reddy : టీఎస్ఆర్టీసీ నూతన చైర్మన్​గా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్​లోని ఆర్టీసీ బస్ భవన్​లోని తన ఛాంబర్​లో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఛైర్మన్ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి(Muthireddy Yadagiri Reddy) మాట్లాడారు. అనుభవుజ్ఞులైన ఎండీ సజ్జనార్(TSRTC MD Sajjanar) నేతృత్వంలో టీఎస్ఆర్టీసీ అన్ని విభాగాల్లో దూసుకుపోతోందని అన్నారు. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి సంస్థ ఎండీ వీసీ సజ్జనార్, ఇతర ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలియజేసి సన్మానించారు. అయితే జనగామ ఎమ్మెల్యే టికెట్‌ను సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కాకుండా పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఇవ్వాలని సీఎం కేసీఆర్‌(CM KCR) నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ముత్తిరెడ్డిని బుజ్జగించడానికి.. ఆర్టీసీ ఛైర్మన్‌ పదవిని ఆయనకు కట్టబెట్టినట్లు తెలుస్తోంది.

MLA Mutthireddy Fires on Palla : పల్లా భూ కబ్జాలన్నీ ఆధారాలతో సహా నిరూపిస్తా: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

MLA Muthireddy Yadagiri Reddy New Post : శాసనసభ ఎన్నికలు(Telangana Assembly Elections) సమీపిస్తున్న వేళ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నలుగురు నేతలకు నామినేటెడ్ పదవులు(CM KCR Appoints Naminated Posts) అప్పగించిన విషయం విధితమే. టికెట్లు ఇవ్వని ఇద్దరు ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తాటికొండ రాజయ్యకు కార్పొరేషన్ పదవులు కట్టబెట్టారు. కాంగ్రెస్‌ను వీడి బుధవారం బీఆర్‌ఎస్‌లో చేరిన నందికంటి శ్రీధర్‌తో పాటు ఇటీవల పార్టీలో చేరిన ఉప్పల వెంకటేశ్‌ గుప్తాకు కూడా నామినేటెడ్ పోస్టులు కేటాయించారు.

రాష్ట్ర రైతుబంధు సమితి(Rythumandhu Samiti) ఛైర్మన్‌గా స్టేషన్ ఘన్​పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఆర్టీసీ ఛైర్మన్‌గా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని నియమించారు. మిషన్ భగీరథ వైస్ ఛైర్మన్‌గా ఉప్పల వెంకటేశ్ గుప్తాను, ఎంబీసీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నందికంటి శ్రీధర్‌లను నియమించారు. ఈ మేరకు నలుగురికి పదవులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా.. వీరంతా రెండేళ్ల పాటు పదవిలో ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

MLA Rajaiah Muthireddy New Posts : రాజయ్యకు రైతు బంధు సమితి.. ముత్తిరెడ్డికి ఆర్టీసీ

MLA Mutthireddy Fires On MLC Palla Rajeswerreddy : 'పల్లా రాజేశ్వర్​ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.