ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ చేపల మార్కెట్ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న తీరుపై ఎమ్మెల్యే ముఠా గోపాల్ కాంట్రాక్టర్పై మండిపడ్డారు. గత నెల 22న రూ. 99 లక్షల వ్యయంతో రాంనగర్ చేపల మార్కెట్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. నిదానంగా సాగుతోన్న పనుల వల్ల వ్యాపారులు, ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి వచ్చింది.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్… రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. చేపల మార్కెట్ అంతా డ్రైనేజీ మురికి దుర్వాసనతో నిండి ఉండడాన్ని చూసిన ఎమ్మెల్యే ముఠా గోపాల్ నివ్వెరపోయారు. నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానికులకు మార్కెట్కు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.