ETV Bharat / state

Muta gopal: కాంట్రాక్టర్ పై మండిపడ్డ ఎమ్మెల్యే ముఠా గోపాల్

author img

By

Published : Jun 8, 2021, 7:04 PM IST

హైదరాబాద్ ముషీరాబాద్ రాంనగర్ చేపల మార్కెట్ ను ఎమ్మెల్యే ముఠా గోపాల్ సందర్శించారు. మార్కెట్ రోడ్డు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పనులు నిదానంగా జరగడం పట్ల కాంట్రాక్టర్​పై మండిపడ్డారు.

mla
mla

ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ చేపల మార్కెట్ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న తీరుపై ఎమ్మెల్యే ముఠా గోపాల్ కాంట్రాక్టర్​పై మండిపడ్డారు. గత నెల 22న రూ. 99 లక్షల వ్యయంతో రాంనగర్ చేపల మార్కెట్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. నిదానంగా సాగుతోన్న పనుల వల్ల వ్యాపారులు, ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి వచ్చింది.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్… రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. చేపల మార్కెట్ అంతా డ్రైనేజీ మురికి దుర్వాసనతో నిండి ఉండడాన్ని చూసిన ఎమ్మెల్యే ముఠా గోపాల్ నివ్వెరపోయారు. నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానికులకు మార్కెట్​కు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ చేపల మార్కెట్ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న తీరుపై ఎమ్మెల్యే ముఠా గోపాల్ కాంట్రాక్టర్​పై మండిపడ్డారు. గత నెల 22న రూ. 99 లక్షల వ్యయంతో రాంనగర్ చేపల మార్కెట్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. నిదానంగా సాగుతోన్న పనుల వల్ల వ్యాపారులు, ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి వచ్చింది.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్… రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. చేపల మార్కెట్ అంతా డ్రైనేజీ మురికి దుర్వాసనతో నిండి ఉండడాన్ని చూసిన ఎమ్మెల్యే ముఠా గోపాల్ నివ్వెరపోయారు. నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్థానికులకు మార్కెట్​కు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.