ETV Bharat / state

Mla muta gopal: ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

author img

By

Published : Jun 5, 2021, 7:22 PM IST

రాష్ట్రంలోని పేద ప్రజల కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 15 కిలోల ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ముషీరాబాద్ నియోజకవర్గంలోని రేషన్ దుకాణంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు.

mla muta gopal started free rice distribution program in musheerabad
ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే ముఠా గోపాల్ స్పష్టం చేశారు. లాక్​డౌన్​ కారణంగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 15 కిలోల ఉచిత బియ్యం పంపిణీ పథకాన్ని ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ప్రారంభించారు. గాంధీ నగర్, బోలక్ పూర్, ముషీరాబాద్, అడిక్​మెట్​, కవాడిగూడ డివిజన్​లలోని రేషన్ దుకాణాల్లో ఆయన ప్రారంభించారు.

పేద ప్రజల కోసం ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ముఠా పద్మ నరేష్, లక్ష్మీ గణపతి దేవాలయం ఛైర్మన్ మచ్చ కుర్తి ప్రభాకర్, తెరాస నాయకులు సత్యనారాయణ, గుండు జగదీష్, భాస్కర్, ముచ్చ కుర్తి పద్మ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే ముఠా గోపాల్ స్పష్టం చేశారు. లాక్​డౌన్​ కారణంగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 15 కిలోల ఉచిత బియ్యం పంపిణీ పథకాన్ని ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ప్రారంభించారు. గాంధీ నగర్, బోలక్ పూర్, ముషీరాబాద్, అడిక్​మెట్​, కవాడిగూడ డివిజన్​లలోని రేషన్ దుకాణాల్లో ఆయన ప్రారంభించారు.

పేద ప్రజల కోసం ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ముఠా పద్మ నరేష్, లక్ష్మీ గణపతి దేవాలయం ఛైర్మన్ మచ్చ కుర్తి ప్రభాకర్, తెరాస నాయకులు సత్యనారాయణ, గుండు జగదీష్, భాస్కర్, ముచ్చ కుర్తి పద్మ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: Eatala Resignation: తెరాసతో తెగతెంపులు... నేడు ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.