ETV Bharat / state

డబుల్​ బెడ్​రూం ఇళ్లు పంపిణీ చేయనున్న మంత్రులు

author img

By

Published : Jan 28, 2021, 8:33 PM IST

Updated : Jan 29, 2021, 4:09 AM IST

నిరుపేదల సొంతిటి కల నెరవేర్చేందుకు హైదరాబాద్​ మహానగర పరిధిలో నిర్మించిన 264 రెండు పడక గదుల ఇళ్లను నేడు మంత్రులు ప్రారంభించనున్నారు. 20 కోట్లు వ్యయం ఈ ఇళ్లను నిర్మించారు.

డబుల్​ బెడ్​రూం ఇళ్లు పంపిణీ చేయనున్న మంత్రులు
డబుల్​ బెడ్​రూం ఇళ్లు పంపిణీ చేయనున్న మంత్రులు

హైదరాబాద్ మహానగర పరిధిలో సుమారు 20 కోట్ల వ్యయంతో నిర్మించిన 264 డబుల్ బెడ్‌ రూం ఇళ్లను రాష్ట్ర మంత్రులు నేడు ప్రారంభించనున్నారు. గాంధీనగర్‌లో 15.50కోట్ల వ్యయంతో జీ ప్లస్ 3 అంతస్తుల్లో 200 రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ సాయిరాంనగర్​లో రూ.4.96 కోట్ల వ్యయంతో జి+3 అంతస్తుల్లో 64 డబుల్ బెడ్ రూం ఇళ్లను జీహెచ్ఎంసీ నిర్మించింది. ఈ ఇళ్లను రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు కలిసి ప్రారంభించనున్నారు.

560 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ డబుల్ బెడ్​రూం ఇళ్లలో ఒక లీవింగ్ రూమ్, రెండు బెడ్ రూమ్​లు, ఒక కిచెన్ రూమ్, రెండు టాయిలెట్లు ఉన్నాయి. ఒక్కొక్కటి రూ.7.75 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ రెండు పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు ఉచితంగా కేటాయించనున్నారు. ఈ ఇళ్ల కాలనీలో మౌలిక సదుపాయాలైన తాగునీరు, విద్యుత్ సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజి, లిఫ్ట్ సౌకర్యం, ఫైర్ సేఫ్టీ, సీసీ రోడ్లు, వీధి దీపాల సౌకర్యాలను ఏర్పాటు చేశారు. గతంలో పూర్తిగా మురికివాడలుగా ఉన్న గాంధీనగర్, సాయిరాం నగర్​లలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం చేపట్టడం వల్ల ఇక్కడి స్థానికులు ఉన్నత ప్రమాణాలతో కలిగిన గృహాల్లో నివసించనున్నారు.

హైదరాబాద్ మహానగర పరిధిలో సుమారు 20 కోట్ల వ్యయంతో నిర్మించిన 264 డబుల్ బెడ్‌ రూం ఇళ్లను రాష్ట్ర మంత్రులు నేడు ప్రారంభించనున్నారు. గాంధీనగర్‌లో 15.50కోట్ల వ్యయంతో జీ ప్లస్ 3 అంతస్తుల్లో 200 రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ సాయిరాంనగర్​లో రూ.4.96 కోట్ల వ్యయంతో జి+3 అంతస్తుల్లో 64 డబుల్ బెడ్ రూం ఇళ్లను జీహెచ్ఎంసీ నిర్మించింది. ఈ ఇళ్లను రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు కలిసి ప్రారంభించనున్నారు.

560 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ డబుల్ బెడ్​రూం ఇళ్లలో ఒక లీవింగ్ రూమ్, రెండు బెడ్ రూమ్​లు, ఒక కిచెన్ రూమ్, రెండు టాయిలెట్లు ఉన్నాయి. ఒక్కొక్కటి రూ.7.75 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ రెండు పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు ఉచితంగా కేటాయించనున్నారు. ఈ ఇళ్ల కాలనీలో మౌలిక సదుపాయాలైన తాగునీరు, విద్యుత్ సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజి, లిఫ్ట్ సౌకర్యం, ఫైర్ సేఫ్టీ, సీసీ రోడ్లు, వీధి దీపాల సౌకర్యాలను ఏర్పాటు చేశారు. గతంలో పూర్తిగా మురికివాడలుగా ఉన్న గాంధీనగర్, సాయిరాం నగర్​లలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం చేపట్టడం వల్ల ఇక్కడి స్థానికులు ఉన్నత ప్రమాణాలతో కలిగిన గృహాల్లో నివసించనున్నారు.

ఇదీ చదవండి: ఉత్తర, దక్షిణ భారత్​కు వారధిగా హైదరాబాద్​: కేటీఆర్​

Last Updated : Jan 29, 2021, 4:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.