ETV Bharat / state

'బండి.. మీ రాష్ట్రం మీరు చూసుకోండి.. ఏపీలో ఏం పని?'

author img

By

Published : Jan 5, 2021, 6:42 PM IST

భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై... ఏపీ మంత్రి వెల్లంపల్లి స్పందించారు. ఏపీలో అంతా బాగానే ఉందని.. ఏమైనా ఉంటే.. తెలంగాణలో చూసుకోవాలని బదులిచ్చారు. ఆలయాలపై రాజకీయాలు జరగటం దురదృష్టకరమన్నారు.

'బండి..  మీ రాష్ట్రం మీరు చూసుకోండి.. ఏపీతో ఏం పని'
'బండి.. మీ రాష్ట్రం మీరు చూసుకోండి.. ఏపీతో ఏం పని'

ఏపీలో రామతీర్థంలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టాలని చూస్తే ఊరుకోబోమని ఆ రాష్ట్ర మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. మతాలంటే ఇష్టమొచ్చినట్లు మాట్లాడే పవన్ కల్యాణ్​తో భాజపా ఎప్పుడైతే పొత్తు పెట్టుకుందో.. నాటి నుంచే తమకు వారిపై గౌరవం పోయిందన్నారు. విజయవాడ టూ టౌన్​లో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. తెదేపా హయాంలో మంత్రి మాణిక్యాలరావు నియోజకవర్గంలో రథం తగలబడినప్పుడు భాజపా నేతలు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో దేవాలయాలపై రాజకీయాలు జరగటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

మీ దగ్గర చూసుకోండి...

ఏపీలో జరుగుతున్న పరిణామాలపై సోమవారం భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి వెల్లంపల్లి స్పందించారు. ఆంధ్రప్రదేశ్​లో అంతా బాగానే ఉందని.. ఏమైనా ఉంటే తెలంగాణలో చూసుకోవాలని హితవు పలికారు.

'బండి సంజయ్...​ ఏమైనా ఉంటే తెలంగాణలో చూసుకోండి. ఈ రాష్ట్రంలో మీకేం పని లేదు. ఏపీలో పరిపాలన అంతా బాగానే ఉంది. మీ వ్యాఖ్యలు ఇక్కడ అవసరం లేదు. ఏమైనా ఉంటే తెలంగాణలో చూసుకుని బాగుపడండి '- వెల్లంపల్లి శ్రీనివాస్, ఏపీ దేవాదాయశాఖ మంత్రి

'బండి.. మీ రాష్ట్రం మీరు చూసుకోండి.. ఏపీతో ఏం పని'

ఇదీ చదవండి: 'సభ్య సమాజానికి కేసీఆర్​ ఏం మెసేజ్​ ఇస్తున్నట్టు?'

ఏపీలో రామతీర్థంలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టాలని చూస్తే ఊరుకోబోమని ఆ రాష్ట్ర మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. మతాలంటే ఇష్టమొచ్చినట్లు మాట్లాడే పవన్ కల్యాణ్​తో భాజపా ఎప్పుడైతే పొత్తు పెట్టుకుందో.. నాటి నుంచే తమకు వారిపై గౌరవం పోయిందన్నారు. విజయవాడ టూ టౌన్​లో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. తెదేపా హయాంలో మంత్రి మాణిక్యాలరావు నియోజకవర్గంలో రథం తగలబడినప్పుడు భాజపా నేతలు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో దేవాలయాలపై రాజకీయాలు జరగటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

మీ దగ్గర చూసుకోండి...

ఏపీలో జరుగుతున్న పరిణామాలపై సోమవారం భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి వెల్లంపల్లి స్పందించారు. ఆంధ్రప్రదేశ్​లో అంతా బాగానే ఉందని.. ఏమైనా ఉంటే తెలంగాణలో చూసుకోవాలని హితవు పలికారు.

'బండి సంజయ్...​ ఏమైనా ఉంటే తెలంగాణలో చూసుకోండి. ఈ రాష్ట్రంలో మీకేం పని లేదు. ఏపీలో పరిపాలన అంతా బాగానే ఉంది. మీ వ్యాఖ్యలు ఇక్కడ అవసరం లేదు. ఏమైనా ఉంటే తెలంగాణలో చూసుకుని బాగుపడండి '- వెల్లంపల్లి శ్రీనివాస్, ఏపీ దేవాదాయశాఖ మంత్రి

'బండి.. మీ రాష్ట్రం మీరు చూసుకోండి.. ఏపీతో ఏం పని'

ఇదీ చదవండి: 'సభ్య సమాజానికి కేసీఆర్​ ఏం మెసేజ్​ ఇస్తున్నట్టు?'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.