ETV Bharat / state

మోదీ సర్కారు అదానీకి ఇచ్చిన భరోసా.. రైతులకు ఇవ్వడం లేదు: మంత్రి నిరంజన్​రెడ్డి

author img

By

Published : Mar 24, 2023, 9:58 PM IST

minister niranjan reddy fires on bjp: సంప్రదాయ చిరుధాన్యాల పంట ఉత్పత్తులకు కేంద్ర ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రచారం కల్పించడం ద్వారా అన్నదాతకు ఆదాయ భద్రత కల్పించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. కేంద్రం అదానీకి ఇచ్చిన భరోసా రైతులకు ఎందుకు ఇవ్వరు.? అని ఎద్దేవా చేశారు.

నిరంజన్​రెడ్డి
నిరంజన్​రెడ్డి

minister niranjan reddy fires on bjp: హైదరాబాద్ మాదాపూర్ నొవాటెల్ హెచ్ఐసీసీలో అసోసియేషన్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా - అసోచాం ఆధ్వర్యంలో జరిగిన చిరుధాన్యాల సదస్సును తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్​రెడ్డి ప్రారంభించారు. సంప్రదాయ చిరుధాన్యాల పంట ఉత్పత్తులకు కేంద్ర ప్రభుత్వం మార్కెటింగ్ కల్పించి అన్నదాతకు ఆదాయ భద్రత కల్పించాలని మంత్రి అన్నారు.

రేపటి భవిష్యత్ తరాలకు ప్రపంచానికి అవసరమైన ఆహారం తెలంగాణ ఇవ్వగలదని బలంగా నమ్ముతున్నాం అందుకే ఈ రంగం మీద దృష్టిసారించి రైతులకు అండగా నిలుస్తున్నాం అని తెలిపారు. రైతులను ప్రోత్సహించడం, పంటల వైవిధ్యీకరణ, పంటల సాగు ప్రణాళిక, పంటల కొనుగోలు వంటి కార్యక్రమాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అన్నారు. గ్రామ గ్రామానికి విస్తరించిన బీఎస్ఎన్ఎల్‌ను నిర్వీర్యం చేసి జియో కంపెనీకి జవసత్వాలు కల్పించి వంద కోట్ల మంది చేతిలో సెల్‌ఫోన్లు పెట్టి వాడక తప్పనిసరి పరిస్థితి తీసుకువచ్చిందని ఆక్షేపించారు.

రైతులకు మీరు పంటలు పండించండి, మేం ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేస్తాం అని ఎందుకు భరోసా ఇవ్వడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి ప్రశ్నించారు. అదానీకి ఇచ్చిన భరోసా రైతాంగానికి ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. రైతు పండించిన పంట మార్కెటింగ్​కు కేంద్రంగా మేం సాయం అందిస్తాం, రాష్ట్రంగా మీరు కొంత సాయం చేయండని మోదీ సర్కారు సహాకారం అందించడం లేదని విమర్శించారు.

స్కాట్లాండ్ లాంటి చిన్న దేశం తమ ఉత్పత్తులైన స్కాచ్ బ్రాండ్ మద్యం ప్రపంచంలో మార్కెటింగ్ చేసుకుంటుందని గుర్తు చేశారు. ఎడారి దేశం సౌదీలో పండే ఖర్జూరం ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ చేస్తుంటే చిరుధాన్యాల పుట్టినిల్లైన భారత్‌లో పండేవి అమెరికా, యూరప్ వంటి దేశాల్లో ఎందుకు ప్రచారం చేయని ఘాటుగా ప్రశ్నించారు. సాధారణంగా మార్కెటింగ్ సమస్యలే రైతాంగం నష్టాలకు ప్రధాన కారణమని పేర్కొన్నారు.

భారతీయ రైతుల సిరిధాన్యాల ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ కోసం కేంద్రం విప్లవాత్మమైన ప్రోత్సాహాలు ఇవ్వాలని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, అసోచాం ప్రతినిధులు పాల్గొన్నారు. చిరుధాన్యాల రైతులు, అంకుర కేంద్రాల నిర్వాహకులు ఈ సదస్సుకు హాజరయ్యారు.

"మోదీ సర్కారు రైతులకు మీరు పంటలు పండించండి. మేం ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేస్తాం అని భరోసా ఇవ్వడం లేదు. అదానీకి ఇచ్చిన భరోసా.. దేశ రైతాంగానికి ఇవ్వడంలేదు. రైతు పండించిన పంట మార్కెటింగ్​కు కేంద్రంగా మేం సాయం అందిస్తాం. రాష్ట్రంగా మీరు కొంత సాయం చేయండని మోదీ సర్కారు సహకారం అందించడం లేదు.మార్కెటింగ్ సమస్యలే రైతాంగ నష్టాలకు ప్రధాన కారణం." -నిరంజన్​రెడ్డి, మంత్రి

ఇవీ చదవండి:

minister niranjan reddy fires on bjp: హైదరాబాద్ మాదాపూర్ నొవాటెల్ హెచ్ఐసీసీలో అసోసియేషన్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా - అసోచాం ఆధ్వర్యంలో జరిగిన చిరుధాన్యాల సదస్సును తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్​రెడ్డి ప్రారంభించారు. సంప్రదాయ చిరుధాన్యాల పంట ఉత్పత్తులకు కేంద్ర ప్రభుత్వం మార్కెటింగ్ కల్పించి అన్నదాతకు ఆదాయ భద్రత కల్పించాలని మంత్రి అన్నారు.

రేపటి భవిష్యత్ తరాలకు ప్రపంచానికి అవసరమైన ఆహారం తెలంగాణ ఇవ్వగలదని బలంగా నమ్ముతున్నాం అందుకే ఈ రంగం మీద దృష్టిసారించి రైతులకు అండగా నిలుస్తున్నాం అని తెలిపారు. రైతులను ప్రోత్సహించడం, పంటల వైవిధ్యీకరణ, పంటల సాగు ప్రణాళిక, పంటల కొనుగోలు వంటి కార్యక్రమాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అన్నారు. గ్రామ గ్రామానికి విస్తరించిన బీఎస్ఎన్ఎల్‌ను నిర్వీర్యం చేసి జియో కంపెనీకి జవసత్వాలు కల్పించి వంద కోట్ల మంది చేతిలో సెల్‌ఫోన్లు పెట్టి వాడక తప్పనిసరి పరిస్థితి తీసుకువచ్చిందని ఆక్షేపించారు.

రైతులకు మీరు పంటలు పండించండి, మేం ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేస్తాం అని ఎందుకు భరోసా ఇవ్వడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి ప్రశ్నించారు. అదానీకి ఇచ్చిన భరోసా రైతాంగానికి ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. రైతు పండించిన పంట మార్కెటింగ్​కు కేంద్రంగా మేం సాయం అందిస్తాం, రాష్ట్రంగా మీరు కొంత సాయం చేయండని మోదీ సర్కారు సహాకారం అందించడం లేదని విమర్శించారు.

స్కాట్లాండ్ లాంటి చిన్న దేశం తమ ఉత్పత్తులైన స్కాచ్ బ్రాండ్ మద్యం ప్రపంచంలో మార్కెటింగ్ చేసుకుంటుందని గుర్తు చేశారు. ఎడారి దేశం సౌదీలో పండే ఖర్జూరం ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ చేస్తుంటే చిరుధాన్యాల పుట్టినిల్లైన భారత్‌లో పండేవి అమెరికా, యూరప్ వంటి దేశాల్లో ఎందుకు ప్రచారం చేయని ఘాటుగా ప్రశ్నించారు. సాధారణంగా మార్కెటింగ్ సమస్యలే రైతాంగం నష్టాలకు ప్రధాన కారణమని పేర్కొన్నారు.

భారతీయ రైతుల సిరిధాన్యాల ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ కోసం కేంద్రం విప్లవాత్మమైన ప్రోత్సాహాలు ఇవ్వాలని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, అసోచాం ప్రతినిధులు పాల్గొన్నారు. చిరుధాన్యాల రైతులు, అంకుర కేంద్రాల నిర్వాహకులు ఈ సదస్సుకు హాజరయ్యారు.

"మోదీ సర్కారు రైతులకు మీరు పంటలు పండించండి. మేం ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేస్తాం అని భరోసా ఇవ్వడం లేదు. అదానీకి ఇచ్చిన భరోసా.. దేశ రైతాంగానికి ఇవ్వడంలేదు. రైతు పండించిన పంట మార్కెటింగ్​కు కేంద్రంగా మేం సాయం అందిస్తాం. రాష్ట్రంగా మీరు కొంత సాయం చేయండని మోదీ సర్కారు సహకారం అందించడం లేదు.మార్కెటింగ్ సమస్యలే రైతాంగ నష్టాలకు ప్రధాన కారణం." -నిరంజన్​రెడ్డి, మంత్రి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.