ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో రవాణాశాఖ మంత్రి ఛాంబర్ ప్రారంభించారు. అందులో భాగంగానే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఛాంబర్లో కూర్చొని పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్టీఏలో ఫ్యాన్సీ నంబర్లకు ఇ-బిడ్డింగ్ నిర్వహిస్తామని తెలిపారు.
దళారుల ప్రమేయం లేకుండా ఫ్యాన్సీ నంబర్లను పొందవచ్చని, ఎవరైనా ఎక్కడి నుంచైనా నంబర్ పోర్టబులిటీ చేసుకోవచ్చని మంత్రి అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఆర్టీఏలో ఇప్పటి వరకు 59 రకాల సేవలు అందిస్తున్నట్లు ఆయన వివరించారు.
ఇవీ చూడండి: తెరాస పతనం తుక్కుగూడ నుంచే: లక్ష్మణ్