ఆంధ్రప్రదేశ్ పంచాయతీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి దాఖలు చేసిన హౌస్మోషన్ పిటిషన్పై హైకోర్టులో విచారణ ముగిసింది. మంత్రి పెద్దిరెడ్డి ఇంటికి పరిమితమై ఉండాలన్న ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలను న్యాయస్థానం రద్దు చేసింది.
ఈనెల 21 వరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఇంటికే పరిమితం కావాలని ఎస్ఈసీ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఎస్ఈసీ ఆదేశాలు రాజ్యాంగ విరుద్దమంటూ.. హైకోర్టులో మంత్రి హౌస్మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలను రద్దు చేసింది. మీడియాతో మాట్లాడొద్దన్న నిబంధనను మాత్రం సమర్థించింది.
ఇదీ చదవండి: ఖమ్మంలో కాంగ్రెస్ అగ్రనేతల పర్యటన.. పార్టీ పూర్వవైభవమే అజెండా!