సికింద్రాబాద్లోని ఆర్యవైశ్య భవన్లో వాజ్పేయీ 96వ జయంతిని పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ సేవలు మరువలేనివని అన్నారు.
దాదాపు 100 మందికి పైగా రక్తదానం చేయడం గొప్ప విషయమన్నారు. అనంతరం రైతుల కోసం ఏర్పాటు చేసిన కిసాన్ సమ్మాన్ నిధి వర్చువల్ సమావేశాన్ని ఆన్లైన్లో వీక్షించారు. ఆ తర్వాత వెంగళ్ రావు నగర్ డివిజన్లోని మహిళా శిశు సంక్షేమ కార్యాలయంలో నిర్వహించిన వాజ్పేయీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: నూతన సంవత్సర వేడుకలకు అనుమతి లేదు: సజ్జనార్