కరోనా మహమ్మారి కట్టడికి రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో మంత్రి నిరంజన్రెడ్డి, ఎంపీ సంతోష్, ఎమ్మెల్సీ కవిత ఇవాళ వాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు.
కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. రెండో దశ వ్యాపిస్తున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఆరోగ్యశాఖ సూచనలను తప్పనిసరిగా పాటించాలని అన్నారు.
వ్యాక్సిన్ తీసుకోవడంలో ఎలాంటి అపోహలు వద్దని ప్రజలకు కవిత చెప్పారు. కరోనా నిబంధనలు పాటిస్తూ అందరూ ధైర్యంగా వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రావాలని ఆమె సూచించారు. వీరితో పాటు సంతోష్ సతీమణి కూడా టీకా తీసుకున్నారు.
ఇదీ చదవండి: శరద్ పవార్కు స్వల్ప అస్వస్థత- ఆస్పత్రిలో చేరిక