ETV Bharat / state

నేడు దావోస్​కు కేటీఆర్​... అక్కడి నుంచే 'పురపోరు' పర్యవేక్షణ - మంత్రి కేటీఆర్​

పురపోరు కీలక దశకు చేరుకున్న సందర్భంలో దావోస్ వెళ్తున్న కేటీఆర్... అక్కడి నుంచే పర్యవేక్షించనున్నారు. రేపు సాయంత్రంతో ప్రచారం ముగియనుండటం వల్ల  పోలింగ్ ముగిసే వరకూ అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల సమన్వయ కమిటీ నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటూ... అవసరమైనప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, అభ్యర్థులతో ఫోన్లో మాట్లాడనున్నారు.

నేడు దావోస్​కు కేటీఆర్​... అక్కడి నుంచే 'పురపోరు' పర్యవేక్షణ
నేడు దావోస్​కు కేటీఆర్​... అక్కడి నుంచే 'పురపోరు' పర్యవేక్షణ
author img

By

Published : Jan 19, 2020, 7:16 AM IST

Updated : Jan 19, 2020, 8:43 AM IST

మున్సిపల్ ఎన్నికల్లో ముందు నుంచి అన్నీ తానై నడిపిస్తున్న తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు నేడు దావోస్ వెళ్లనున్నారు. మరోవైపు ప్రచారం తారాస్థాయికి చేరింది. రేపటితో ప్రచారఘట్టం ముగియనుండగా దావోస్ వెళ్తున్న కేటీఆర్... పోలింగ్ ముగిసిన తర్వాతే తిరుగు పయనం కానున్నారు. కీలక సమయంలో విదేశీ పర్యటనకు వెళ్తున్న కేటీఆర్... అక్కడి నుంచే పార్టీ ఎన్నికల కార్యక్రమాలను పర్యవేక్షించనున్నారు.

ఎప్పటికప్పుడు నివేదికలు చేరివేత:

తొమ్మిది మంది కీలక నేతలతో కూడిన రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ తెలంగాణ భవన్ నుంచి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. జిల్లాల వారీగా వివరాలు సేకరిస్తున్న కమిటీ.. ఎప్పటికప్పుడు కేటీఆర్​కు చేరవేయనుంది. నివేదికల ఆధారంగా సమన్వయ కమిటీ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు... అవసరమైతే అభ్యర్థులతో కేటీఆర్ ఫోన్​లో మాట్లాడి దిశా నిర్దేశం చేయనున్నారు.

ఏ మాత్రం నిర్లక్ష్యం వద్దు:

రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో విజయం సాధిస్తామన్న ధీమాతో ఉన్నా... ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దంటూ పార్టీ శ్రేణులకు కేటీఆర్ ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. పోలింగ్, మేయర్, ఛైర్మన్ ఎన్నిక పూర్తయ్యే వరకూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఇవాళ కూడా కీలక నేతలతో సమీక్షించి.. అనుసరించాల్సిన వ్యూహాలను వివరించనున్నారు.

నేడు దావోస్​కు కేటీఆర్​... అక్కడి నుంచే 'పురపోరు' పర్యవేక్షణ

ఇవీ చూడండి:డబ్ల్యుూఈఎఫ్​కు రెండోసారి హాజరవనున్న కేటీఆర్​

మున్సిపల్ ఎన్నికల్లో ముందు నుంచి అన్నీ తానై నడిపిస్తున్న తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు నేడు దావోస్ వెళ్లనున్నారు. మరోవైపు ప్రచారం తారాస్థాయికి చేరింది. రేపటితో ప్రచారఘట్టం ముగియనుండగా దావోస్ వెళ్తున్న కేటీఆర్... పోలింగ్ ముగిసిన తర్వాతే తిరుగు పయనం కానున్నారు. కీలక సమయంలో విదేశీ పర్యటనకు వెళ్తున్న కేటీఆర్... అక్కడి నుంచే పార్టీ ఎన్నికల కార్యక్రమాలను పర్యవేక్షించనున్నారు.

ఎప్పటికప్పుడు నివేదికలు చేరివేత:

తొమ్మిది మంది కీలక నేతలతో కూడిన రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ తెలంగాణ భవన్ నుంచి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. జిల్లాల వారీగా వివరాలు సేకరిస్తున్న కమిటీ.. ఎప్పటికప్పుడు కేటీఆర్​కు చేరవేయనుంది. నివేదికల ఆధారంగా సమన్వయ కమిటీ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు... అవసరమైతే అభ్యర్థులతో కేటీఆర్ ఫోన్​లో మాట్లాడి దిశా నిర్దేశం చేయనున్నారు.

ఏ మాత్రం నిర్లక్ష్యం వద్దు:

రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో విజయం సాధిస్తామన్న ధీమాతో ఉన్నా... ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దంటూ పార్టీ శ్రేణులకు కేటీఆర్ ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. పోలింగ్, మేయర్, ఛైర్మన్ ఎన్నిక పూర్తయ్యే వరకూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఇవాళ కూడా కీలక నేతలతో సమీక్షించి.. అనుసరించాల్సిన వ్యూహాలను వివరించనున్నారు.

నేడు దావోస్​కు కేటీఆర్​... అక్కడి నుంచే 'పురపోరు' పర్యవేక్షణ

ఇవీ చూడండి:డబ్ల్యుూఈఎఫ్​కు రెండోసారి హాజరవనున్న కేటీఆర్​

TG_HYD_08_19_KTR_FROM_DAVOS_PKG_3064645 REPORTER: Nageshwara Chary note: ఫైల్ విజువల్స్ వాడుకోగలరు. ( ) పురపోరు కీలక దశకు చేరుకున్న సందర్భంలో దావోస్ వెళ్తున్న తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్... అక్కడి నుంచే పర్యవేక్షించనున్నారు. రేపు సాయంత్రంతో ప్రచారం ముగియనున్నప్పటికీ... పోలింగ్ ముగిసే వరకూ అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల సమన్వయ కమిటీ నుంచి ఎప్పటి కప్పుడు సమాచారం తీసుకుంటూ... అవసరమైనప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు, అభ్యర్థులతో ఫోన్లో మాట్లాడనున్నారు. లుక్ వాయిస్ ఓవర్: మున్సిపల్ ఎన్నికల్లో ముందు నుంచి అన్నీ తానై నడిపిస్తున్న తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు నేడు దావోస్ వెళ్లనున్నారు. మరోవైపు ప్రచారం తారాస్థాయికి చేరింది. రేపటితో ప్రచారఘట్టం ముగియనున్న సందర్భలో దావోస్ వెళ్తున్న కేటీఆర్... పోలింగ్ ముగిసిన తర్వాతే రానున్నారు. కీలక సమయంలో విదేశీ పర్యటన వెళ్తున్న కేటీఆర్... అక్కడి నుంచే పార్టీ ఎన్నికల కార్యక్రమాలను పర్యవేక్షించనున్నారు. తొమ్మిది మంది కీలక నేతలతో కూడిన రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ తెలంగాణ భవన్ నుంచి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. జిల్లాల వారీగా వివరాలు సేకరిస్తున్న కమిటీ... ఎప్పటి కప్పుడు కేటీఆర్ కు చేరవేయనున్నారు. నివేదికల ఆధారంగా సమన్వయ కమిటీ సబ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు... అవసరమైతే అభ్యర్థులతో కేటీఆర్ ఫోన్ లో మాట్లాడి దిశా నిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో విజయం సాధిస్తామన్న ధీమాతో ఉన్నప్పటికీ... ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దంటూ పార్టీ శ్రేణులకు కేటీఆర్ ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. పోలింగ్, మేయర్, ఛైర్మన్ ఎన్నిక పూర్తయ్యే వరకూ అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఇవాళ కూడా కీలక నేతలతో సమీక్షించి.. అనుసరించాల్సిన వ్యూహాలను వివరించనున్నారు. ఎండ్
Last Updated : Jan 19, 2020, 8:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.