ETV Bharat / state

'పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సిబ్బంది పెరగాలి'

పురపాలక శాఖలో ఖాళీల భర్తీపై ఆ శాఖ మంత్రి కేటీఆర్​ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. పట్టణ ప్రాంతాల్లో మార్పు లక్ష్యంగా ప్రభుత్వ ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పెరుగుతున్న పట్టణీకరణ, పట్టణాల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సిబ్బంది కేటాయింపు ఉండాలని సూచించారు.

author img

By

Published : Jul 14, 2020, 1:36 PM IST

minister-ktr-review-on-filling-of-vacancies-in-municipalities
పురపాలికల్లో ఖాళీల భర్తీపై మంత్రి కేటీఆర్ సమీక్ష

పురపాలికల్లో ప్రస్తుత సిబ్బందిని హేతుబద్ధీకరించి.. ఆ తర్వాత పట్టణ ప్రజల అవసరాల మేరకు నూతన సిబ్బంది నియామకం చేపట్టనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. మున్సిపాలిటీలో ఖాళీలను భర్తీ చేస్తామని ఇటీవల ప్రకటించిన మంత్రి.. ఖాళీల భర్తీపై సంబంధిత అధికారులతో ఇవాళ సమీక్ష నిర్వహించారు.

పట్టణ ప్రాంతాల్లో మార్పు లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తోందని, పెరుగుతున్న పట్టణీకరణ, పట్టణాల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సిబ్బందిని కేటాయిస్తామని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న సిబ్బందిని హేతుబద్ధీకరించాక పట్టణ ప్రజల అవసరాల మేరకు నూతన సిబ్బంది నియామకం చేపడతామని అన్నారు. ఇంజినీరింగ్, ఇన్​ఫ్రా విభాగాలకు ప్రాధాన్యత ఉంటుందన్న ఆయన.. పరిపాలన వికేంద్రీకరణ స్ఫూర్తి మేరకు ప్రజలకు పాలనా ప్రతిఫలాలు అందాలని స్పష్టం చేశారు.

నూతన పురపాలక చట్టం నియమ నిబంధనల మేరకు ప్రజలకు మరింత సౌకర్యవంతమైన పాలన అందించేలా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి చెప్పారు. హైదరాబాద్, ఔటర్ రింగ్​రోడ్డు పరిసర మున్సిపాలిటీలు, జిల్లా కేంద్రాల్లో సిబ్బంది అవసరం ఎక్కువ ఉంటుందని, ఆయా మున్సిపాలిటీల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇదీచూడండి: 'సిద్దిపేట నమూనాతో పట్టణాలు అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకోవాలి'

పురపాలికల్లో ప్రస్తుత సిబ్బందిని హేతుబద్ధీకరించి.. ఆ తర్వాత పట్టణ ప్రజల అవసరాల మేరకు నూతన సిబ్బంది నియామకం చేపట్టనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. మున్సిపాలిటీలో ఖాళీలను భర్తీ చేస్తామని ఇటీవల ప్రకటించిన మంత్రి.. ఖాళీల భర్తీపై సంబంధిత అధికారులతో ఇవాళ సమీక్ష నిర్వహించారు.

పట్టణ ప్రాంతాల్లో మార్పు లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తోందని, పెరుగుతున్న పట్టణీకరణ, పట్టణాల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సిబ్బందిని కేటాయిస్తామని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న సిబ్బందిని హేతుబద్ధీకరించాక పట్టణ ప్రజల అవసరాల మేరకు నూతన సిబ్బంది నియామకం చేపడతామని అన్నారు. ఇంజినీరింగ్, ఇన్​ఫ్రా విభాగాలకు ప్రాధాన్యత ఉంటుందన్న ఆయన.. పరిపాలన వికేంద్రీకరణ స్ఫూర్తి మేరకు ప్రజలకు పాలనా ప్రతిఫలాలు అందాలని స్పష్టం చేశారు.

నూతన పురపాలక చట్టం నియమ నిబంధనల మేరకు ప్రజలకు మరింత సౌకర్యవంతమైన పాలన అందించేలా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి చెప్పారు. హైదరాబాద్, ఔటర్ రింగ్​రోడ్డు పరిసర మున్సిపాలిటీలు, జిల్లా కేంద్రాల్లో సిబ్బంది అవసరం ఎక్కువ ఉంటుందని, ఆయా మున్సిపాలిటీల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇదీచూడండి: 'సిద్దిపేట నమూనాతో పట్టణాలు అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.