ETV Bharat / state

కోటి టన్నులైనా కొనేందుకు సిద్ధం : మంత్రి గంగుల

కోటి టన్నుల ధాన్యాన్నైనా కొనేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. సంచుల కొరత అధిగమిస్తామని... ధాన్యాన్ని మిల్లుల్లో రాశులుగా నిల్వ చేసి... ఆ సంచులను మళ్లీ వినియోగిస్తామని చెప్పారు.

author img

By

Published : Apr 24, 2020, 6:05 AM IST

Updated : Apr 24, 2020, 6:11 AM IST

మంత్రి గంగుల
మంత్రి గంగుల

ధాన్యం సేకరణలో గోనె సంచుల కొరతను అధిగమించేందుకు వ్యూహాత్మక ప్రణాళికను రూపొందించామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ చెప్పారు. మిల్లులకు తెచ్చిన సంచులను తిరిగి కొనుగోలు కేంద్రాలకు తేవాలని నిర్ణయించామని వివరించారు. ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయని, కరోనా నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు.

4800 కొనుగోలు కేంద్రాలు

  • ఇప్పటికి 4,800 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. 11 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొన్నాం. రబీలో 1.05 కోట్ల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. వచ్చే సీజను విత్తనాల కోసం, సొంత అవసరాల కోసం రైతులు కొంత నిల్వ చేసుకుంటారు. అవన్నీ పోను 75 లక్షల నుంచి 80 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు విక్రయానికి రావచ్చని అంచనా. కోటి మెట్రిక్‌ టన్నులు తెచ్చినా కొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్థిక వెసులుబాటును కల్పించారు.
  • ధాన్యం దిగుబడి పెరగటంతో సుమారు 20 కోట్ల గోనె సంచులు అవసరం. పశ్చిమ బెంగాల్‌లోని జూట్‌ మిల్లుల నుంచి సంచులు రావాలి. లాక్‌డౌన్‌తో వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం సుమారు 15 కోట్ల వరకు అందుబాటులో ఉంటాయి. మిగిలిన 5 కోట్ల విషయంలోనే ఇబ్బంది. దాన్ని అధిగమించేందుకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లుల్లో పోసి సంచులను తిరిగి కేంద్రాలకు తేవాలని నిర్ణయించాం. ఈ విధానంతో కొరతను అధిగమించాలన్నది వ్యూహం. ఇలాంటి ప్రయోగం చేయడం ఇదే మొదటిసారి.

కొనుగోలు కేంద్రాల మ్యాపింగ్‌

కొనుగోలు కేంద్రాలు, వాటిపరిధిలోకి వచ్చే గ్రామాలను జియో మ్యాపింగ్‌ చేశాం. ఏయే గ్రామాల రైతులు ఎక్కడ విక్రయించారన్నది స్పష్టత వస్తుంది. ఏ గ్రామంలో ఏ రైతు ఎంత విస్తీర్ణంలో వరి సాగు చేశారు? ఎంత దిగుబడి వచ్చింది? అన్న లెక్కలు కూడా తేలికవుతాయి. గతంలో రేషన్‌ బియ్యాన్ని కొందరు మిల్లర్లు కొని వాటిని కస్టమ్‌ మిల్లింగ్‌ బియ్యంగా ప్రభుత్వానికి తిరిగిస్తున్నారు. ఇలాంటి అక్రమాలు ఇక సాగవు.

బియ్యం నిల్వలు పుష్కలం

రేషన్‌ కార్డుదారులకు సాధారణ రోజుల్లో ఇచ్చే బియ్యం కన్నా 100 శాతం ఎక్కువగా ఇస్తున్నా ప్రభుత్వం వద్ద నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. ప్రతి నెలా 1.91 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని 87.54 లక్షల మంది కార్డుదారులకు ఇస్తాం. కరోనాతో ముఖ్యమంత్రి ఆ కోటాను మరో 100 శాతం పెంచారు. ఏప్రిల్‌లోనే కాదు మే నెలలో కూడా ఇదే తరహాలో ఇవ్వాలని ఆదేశించారు. మే నెల కోటా ఇచ్చినా, ఇంకా 8 -9 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం నిల్వ ఉంటాయి.

ఇదీ చదవండి: సీఎంకు పీసీసీ కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్‌ కమిటీ లేఖ

ధాన్యం సేకరణలో గోనె సంచుల కొరతను అధిగమించేందుకు వ్యూహాత్మక ప్రణాళికను రూపొందించామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ చెప్పారు. మిల్లులకు తెచ్చిన సంచులను తిరిగి కొనుగోలు కేంద్రాలకు తేవాలని నిర్ణయించామని వివరించారు. ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయని, కరోనా నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు.

4800 కొనుగోలు కేంద్రాలు

  • ఇప్పటికి 4,800 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. 11 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొన్నాం. రబీలో 1.05 కోట్ల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. వచ్చే సీజను విత్తనాల కోసం, సొంత అవసరాల కోసం రైతులు కొంత నిల్వ చేసుకుంటారు. అవన్నీ పోను 75 లక్షల నుంచి 80 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకు విక్రయానికి రావచ్చని అంచనా. కోటి మెట్రిక్‌ టన్నులు తెచ్చినా కొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్థిక వెసులుబాటును కల్పించారు.
  • ధాన్యం దిగుబడి పెరగటంతో సుమారు 20 కోట్ల గోనె సంచులు అవసరం. పశ్చిమ బెంగాల్‌లోని జూట్‌ మిల్లుల నుంచి సంచులు రావాలి. లాక్‌డౌన్‌తో వచ్చే అవకాశం లేదు. ప్రస్తుతం సుమారు 15 కోట్ల వరకు అందుబాటులో ఉంటాయి. మిగిలిన 5 కోట్ల విషయంలోనే ఇబ్బంది. దాన్ని అధిగమించేందుకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లుల్లో పోసి సంచులను తిరిగి కేంద్రాలకు తేవాలని నిర్ణయించాం. ఈ విధానంతో కొరతను అధిగమించాలన్నది వ్యూహం. ఇలాంటి ప్రయోగం చేయడం ఇదే మొదటిసారి.

కొనుగోలు కేంద్రాల మ్యాపింగ్‌

కొనుగోలు కేంద్రాలు, వాటిపరిధిలోకి వచ్చే గ్రామాలను జియో మ్యాపింగ్‌ చేశాం. ఏయే గ్రామాల రైతులు ఎక్కడ విక్రయించారన్నది స్పష్టత వస్తుంది. ఏ గ్రామంలో ఏ రైతు ఎంత విస్తీర్ణంలో వరి సాగు చేశారు? ఎంత దిగుబడి వచ్చింది? అన్న లెక్కలు కూడా తేలికవుతాయి. గతంలో రేషన్‌ బియ్యాన్ని కొందరు మిల్లర్లు కొని వాటిని కస్టమ్‌ మిల్లింగ్‌ బియ్యంగా ప్రభుత్వానికి తిరిగిస్తున్నారు. ఇలాంటి అక్రమాలు ఇక సాగవు.

బియ్యం నిల్వలు పుష్కలం

రేషన్‌ కార్డుదారులకు సాధారణ రోజుల్లో ఇచ్చే బియ్యం కన్నా 100 శాతం ఎక్కువగా ఇస్తున్నా ప్రభుత్వం వద్ద నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. ప్రతి నెలా 1.91 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని 87.54 లక్షల మంది కార్డుదారులకు ఇస్తాం. కరోనాతో ముఖ్యమంత్రి ఆ కోటాను మరో 100 శాతం పెంచారు. ఏప్రిల్‌లోనే కాదు మే నెలలో కూడా ఇదే తరహాలో ఇవ్వాలని ఆదేశించారు. మే నెల కోటా ఇచ్చినా, ఇంకా 8 -9 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం నిల్వ ఉంటాయి.

ఇదీ చదవండి: సీఎంకు పీసీసీ కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్‌ కమిటీ లేఖ

Last Updated : Apr 24, 2020, 6:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.