ETV Bharat / state

తెలంగాణలో కొత్తగా 18 డయాగ్నస్టిక్‌ సెంటర్లు: మంత్రి ఈటల

author img

By

Published : Mar 25, 2021, 12:43 PM IST

రాష్ట్రంలో కొత్తగా 18 టీఎస్‌-డయాగ్నస్టిక్‌ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్ల మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు. ఏప్రిల్‌ నాటికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. పేదలందరికీ ఉచిత రోగనిర్ధరణ పరీక్షలు చేయడమే లక్ష్యమని వెల్లడించారు.

తెలంగాణలో కొత్తగా 18 డయాగ్నస్టిక్‌ సెంటర్లు: మంత్రి ఈటల
తెలంగాణలో కొత్తగా 18 డయాగ్నస్టిక్‌ సెంటర్లు: మంత్రి ఈటల

పేదలకు రూపాయి ఖర్చులేకుండా రోగ నిర్ధరణ పరీక్షలు చేయించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. ప్రభుత్వాసుపత్రుల్లో రోగ నిర్ధరణ కేంద్రాల ఏర్పాటుపై సభ్యులడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. హైదరాబాద్‌తోపాటు సిద్దిపేట జిల్లాలో టీఎస్-డయాగ్నస్టిక్స్‌ సెంటర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వీటికితోడు మరో 18 కేంద్రాల ఏర్పాటుకు ఏప్రిల్‌ నాటికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఈటల సభకు వివరించారు. 60 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తున్నామని.. కోటి నుంచి కోటిన్నర రూపాయల పరికరాలు సమకూర్చి జిల్లాల్లోనూ టీఎస్-డయాగ్నస్టిక్స్‌ అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.

కరీంనగర్‌, కొత్తగూడెం, ఆసిఫాబాద్‌, ఖమ్మం, సంగారెడ్డి, నిజామాబాద్‌, నిర్మల్‌, మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌, వికారాబాద్‌, మెదక్‌, జగిత్యాల, జనగాం, గద్వాల, మహబూబాబాద్‌, ములుగు, సిరిసిల్ల, నల్గొండ జిల్లాల్లో కొత్త కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మంత్రి ఈటల వెల్లడించారు.

తెలంగాణలో కొత్తగా 18 డయాగ్నస్టిక్‌ సెంటర్లు: మంత్రి ఈటల

పేదలకు రూపాయి ఖర్చులేకుండా రోగ నిర్ధరణ పరీక్షలు చేయించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. ప్రభుత్వాసుపత్రుల్లో రోగ నిర్ధరణ కేంద్రాల ఏర్పాటుపై సభ్యులడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిచ్చారు. హైదరాబాద్‌తోపాటు సిద్దిపేట జిల్లాలో టీఎస్-డయాగ్నస్టిక్స్‌ సెంటర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వీటికితోడు మరో 18 కేంద్రాల ఏర్పాటుకు ఏప్రిల్‌ నాటికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఈటల సభకు వివరించారు. 60 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తున్నామని.. కోటి నుంచి కోటిన్నర రూపాయల పరికరాలు సమకూర్చి జిల్లాల్లోనూ టీఎస్-డయాగ్నస్టిక్స్‌ అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.

కరీంనగర్‌, కొత్తగూడెం, ఆసిఫాబాద్‌, ఖమ్మం, సంగారెడ్డి, నిజామాబాద్‌, నిర్మల్‌, మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌, వికారాబాద్‌, మెదక్‌, జగిత్యాల, జనగాం, గద్వాల, మహబూబాబాద్‌, ములుగు, సిరిసిల్ల, నల్గొండ జిల్లాల్లో కొత్త కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మంత్రి ఈటల వెల్లడించారు.

తెలంగాణలో కొత్తగా 18 డయాగ్నస్టిక్‌ సెంటర్లు: మంత్రి ఈటల
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.