ETV Bharat / state

'కేసీఆర్ కిట్ ప్రవేశ పెట్టాక ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయి'

author img

By

Published : Sep 14, 2020, 10:52 AM IST

కేసీఆర్‌ కిట్‌ ప్రవేశపెట్టాక ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల నియామకం జరుగుతోందని వెల్లడించారు. గర్భవతుల రవాణా కోసం 102 వ్యవస్థను అనుసంధానించామన్నారు.

minister-etela-rajender-on-kcr-kits-in-telangana-assembly
'కేసీఆర్ కిట్ ప్రవేశ పెట్టాక ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయి'

ప్రస్తుతం ఎక్కడా కొత్త ఆస్పత్రులను అప్​గ్రేడ్ చేసే పరిస్థితి లేదని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కేసీఆర్ కిట్ అనేది ఏదో అనాలోచితంగా పెట్టింది కాదని మంత్రి వెల్లడించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో దీనిని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈ కిట్ ప్రవేశ పెట్టాక ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని వెల్లడించారు.

'కేసీఆర్ కిట్ ప్రవేశ పెట్టాకే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయి'

ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో రోగుల అవ‌స‌రాల‌ను తీర్చ‌డానికి పున‌రుద్ధ‌ర‌ణ చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంతో పాటు మౌలిక వ‌స‌తులు క‌ల్పించామ‌న్నారు. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌ను క్ర‌మ‌క్ర‌మంగా బలోపేతం చేస్తున్నామ‌ని స్పష్టం చేశారు. అవ‌స‌ర‌మైన చోట అద‌న‌పు డాక్ట‌ర్లు, సిబ్బంద‌ని నియ‌మిస్తున్నామ‌ని తెలిపారు.

గ‌ర్భిణి ఆరోగ్య ప‌రిస్థితిని బ‌ట్టి ఆయా ఆస్ప‌త్రుల‌కు పంపి డెలివ‌రీలు చేస్తున్నార‌ని పేర్కొన్నారు. గ‌ర్భిణిల ఆరోగ్య ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు ఆశా వ‌ర్క‌ర్లు ప‌రిశీలిస్తున్నార‌ని చెప్పారు. కేసీఆర్ కిట్ ప‌థ‌కాన్ని కేంద్రం కూడా ప్ర‌శంసించింద‌ని మంత్రి వెల్లడించారు.

ఇదీ చూడండి: ఆన్​లైన్​ పాఠాలతో ఫోన్ బిల్లుల మోత!

ప్రస్తుతం ఎక్కడా కొత్త ఆస్పత్రులను అప్​గ్రేడ్ చేసే పరిస్థితి లేదని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కేసీఆర్ కిట్ అనేది ఏదో అనాలోచితంగా పెట్టింది కాదని మంత్రి వెల్లడించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంతో దీనిని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈ కిట్ ప్రవేశ పెట్టాక ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని వెల్లడించారు.

'కేసీఆర్ కిట్ ప్రవేశ పెట్టాకే ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెరిగాయి'

ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో రోగుల అవ‌స‌రాల‌ను తీర్చ‌డానికి పున‌రుద్ధ‌ర‌ణ చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంతో పాటు మౌలిక వ‌స‌తులు క‌ల్పించామ‌న్నారు. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌ను క్ర‌మ‌క్ర‌మంగా బలోపేతం చేస్తున్నామ‌ని స్పష్టం చేశారు. అవ‌స‌ర‌మైన చోట అద‌న‌పు డాక్ట‌ర్లు, సిబ్బంద‌ని నియ‌మిస్తున్నామ‌ని తెలిపారు.

గ‌ర్భిణి ఆరోగ్య ప‌రిస్థితిని బ‌ట్టి ఆయా ఆస్ప‌త్రుల‌కు పంపి డెలివ‌రీలు చేస్తున్నార‌ని పేర్కొన్నారు. గ‌ర్భిణిల ఆరోగ్య ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు ఆశా వ‌ర్క‌ర్లు ప‌రిశీలిస్తున్నార‌ని చెప్పారు. కేసీఆర్ కిట్ ప‌థ‌కాన్ని కేంద్రం కూడా ప్ర‌శంసించింద‌ని మంత్రి వెల్లడించారు.

ఇదీ చూడండి: ఆన్​లైన్​ పాఠాలతో ఫోన్ బిల్లుల మోత!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.