ETV Bharat / state

'డంప్​యార్డుల నిర్మాణాలు వేగంగా పూర్తిచేయాలి : మంత్రి ఎర్రబెల్లి'

గ్రామాల్లో డంప్​యార్డుల నిర్మాణాలు సాధ్యమైనంత వేగంగా పూర్తిచేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. గ్రామీణాభివృద్ధి శాఖ రూపొందించిన మార్గదర్శకాలను మంత్రి విడుదల చేశారు.

author img

By

Published : Jul 1, 2020, 4:04 PM IST

minister errabelli said Dump yard construction should be completed faster
'డంప్​యార్డుల నిర్మాణాలు వేగంగా పూర్తిచేయాలి : మంత్రి ఎర్రబెల్లి'

పల్లెప్రగతిలో భాగంగా డంప్​యార్డుల నిర్మాణం, తడి-పొడిచెత్త నిర్వహణపై గ్రామీణాభివృద్ధి శాఖ మార్గదర్శకాలను రూపొందించింది. ఈ మేరకు ఆ మార్గదర్శకాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విడుదల చేశారు. త‌డి, పొడి చెత్త‌ సేక‌ర‌ణ స‌మ‌యంలోనే వేరు కావాలని... అలా కాకపోతే డంప్​ యార్డుల్లో క‌చ్చితంగా వేరు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. సేంద్రీయ ఎరువుల త‌యారీని చేప‌ట్టి ఆ ఎరువుల‌తో బంగారు పంటలు పండించాలని ఎర్రబెల్లి తెలిపారు.

మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అనుస‌రించి త‌డి, పొడి చెత్త నిర్వ‌హ‌ణ‌తోపాటు సేంద్రీయ ఎరువుల‌ను త‌యారు చేయాల‌ని సూచించారు. కచ్చితంగా మార్గ‌ద‌ర్శ‌కాలు పాటించాల‌ని అధికారుల‌కు తెలిపారు. సర్పంచ్​లు, ప్రజాప్రతినిధులు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. డంప్ యార్డుల చుట్టూ ఫెన్సింగ్​ పొడ‌వు పెరిగే మొక్క‌ల‌ను నాటాల‌ని చెప్పారు. ప‌చ్చ‌ద‌నం-ప‌రిశుభ్ర‌త ద్వారా ఆరోగ్య తెలంగాణ సాధ్య‌మ‌వుతుంద‌ని ద‌యాక‌ర్​రావు అన్నారు. అధికారులు ఆ దిశ‌గా ప‌ని చేయాల‌ని మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు.

పల్లెప్రగతిలో భాగంగా డంప్​యార్డుల నిర్మాణం, తడి-పొడిచెత్త నిర్వహణపై గ్రామీణాభివృద్ధి శాఖ మార్గదర్శకాలను రూపొందించింది. ఈ మేరకు ఆ మార్గదర్శకాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విడుదల చేశారు. త‌డి, పొడి చెత్త‌ సేక‌ర‌ణ స‌మ‌యంలోనే వేరు కావాలని... అలా కాకపోతే డంప్​ యార్డుల్లో క‌చ్చితంగా వేరు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. సేంద్రీయ ఎరువుల త‌యారీని చేప‌ట్టి ఆ ఎరువుల‌తో బంగారు పంటలు పండించాలని ఎర్రబెల్లి తెలిపారు.

మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అనుస‌రించి త‌డి, పొడి చెత్త నిర్వ‌హ‌ణ‌తోపాటు సేంద్రీయ ఎరువుల‌ను త‌యారు చేయాల‌ని సూచించారు. కచ్చితంగా మార్గ‌ద‌ర్శ‌కాలు పాటించాల‌ని అధికారుల‌కు తెలిపారు. సర్పంచ్​లు, ప్రజాప్రతినిధులు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. డంప్ యార్డుల చుట్టూ ఫెన్సింగ్​ పొడ‌వు పెరిగే మొక్క‌ల‌ను నాటాల‌ని చెప్పారు. ప‌చ్చ‌ద‌నం-ప‌రిశుభ్ర‌త ద్వారా ఆరోగ్య తెలంగాణ సాధ్య‌మ‌వుతుంద‌ని ద‌యాక‌ర్​రావు అన్నారు. అధికారులు ఆ దిశ‌గా ప‌ని చేయాల‌ని మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు.

ఇదీ చూడండి : హరితహారం, పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం.. సర్పంచ్ సస్పెన్షన్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.