ETV Bharat / state

ఏ పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం: ఈటల - minister eetela rajendar

ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనే సత్తా తెలంగాణ ప్రభుత్వానికి ఉందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​ స్పష్టం చేశారు. కరోనాను ఎదుర్కునేందుకు కమిటీలు కూడా వేశామన్నారు.

minister eetela rajendar spoke on karona virus
'ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనే సత్తా ఉంది'
author img

By

Published : Mar 5, 2020, 5:01 PM IST

Updated : Mar 5, 2020, 9:13 PM IST

కరోనా దృష్ట్యా తెలంగాణ వైద్య విభాగం నాలుగు రోజులుగా ఉత్కంఠగా ఉందని మంత్రి ఈటల రాజేందర్​ అన్నారు. ప్రజలకు అవగాహన కల్పించడంలో మీడియా బాగా సహకరించిందన్నారు. రాబోయేకాలంలో కూడా రాకూడదని కోరుకుందామన్నారు. కొవిడ్​-19ను ఎలా ఎదుర్కోవాలంటూ కమిటీలు వేశామని... రాష్ట్ర ప్రభుత్వ చర్యలను చూసి కేంద్రం కితాబిచ్చిందని తెలిపారు.

ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనే సత్తా తెలంగాణ ప్రభుత్వానికి ఉందని వెల్లడించారు. ఈ వైరస్‌ గాలితో వచ్చేది కాదని... కరోనా వచ్చిందంటూ సాఫ్ట్‌వేర్‌ కార్యాలయాన్ని ఖాళీ చేశారని చెప్పారు. ఎప్పుడూ అతిగా స్పందించవద్దంటూ హితవు పలికారు. ఇప్పటివరకు తెలంగాణలో ఒక్కరికి కూడా కరోనా రాలేదని... గాంధీలో ఉన్న వ్యక్తికి కరోనా దుబాయిలో వచ్చిందని తెలిపారు. ఆ వ్యక్తి రెండ్రోజుల్లో డిశ్చార్జ్‌ అవ్వచ్చొని చెప్పారు.

మొత్తం 21 నమూనాలు నెగిటివ్‌ వచ్చాయని... ఈరోజు కొత్తగా 10 నమూనాలు తీసుకున్నారని పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు మాకు పరీక్షలు చేయండి అంటున్నారని... ఆ విధంగా ఇన్ఫెక్షన్​ లేకున్నా పరీక్షలు చేయడం కుదరదని ఈటల చెప్పారు. ఆస్పత్రిలో జాయిన్‌ అవ్వాలంటే కచ్చితంగా లక్షణాలు ఉండాలని ఆయన అన్నారు. ఐసోలేషన్‌కు సిద్ధంగా ఉన్నామని అన్ని మెడికల్‌ కళాశాలలు చెప్పాయని పేర్కొన్నారు. రెండు పరీక్షలు నెగిటివ్‌ వచ్చాయని రిలాక్స్‌ అవ్వట్లేదని... అన్ని విభాగాలు, తాము ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు.

'ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనే సత్తా ఉంది'

ఇవీ చూడండి: ప్రైవేటు ఆస్పత్రికి కరోనా సోకిన ఇటలీ పర్యటకులు

కరోనా దృష్ట్యా తెలంగాణ వైద్య విభాగం నాలుగు రోజులుగా ఉత్కంఠగా ఉందని మంత్రి ఈటల రాజేందర్​ అన్నారు. ప్రజలకు అవగాహన కల్పించడంలో మీడియా బాగా సహకరించిందన్నారు. రాబోయేకాలంలో కూడా రాకూడదని కోరుకుందామన్నారు. కొవిడ్​-19ను ఎలా ఎదుర్కోవాలంటూ కమిటీలు వేశామని... రాష్ట్ర ప్రభుత్వ చర్యలను చూసి కేంద్రం కితాబిచ్చిందని తెలిపారు.

ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనే సత్తా తెలంగాణ ప్రభుత్వానికి ఉందని వెల్లడించారు. ఈ వైరస్‌ గాలితో వచ్చేది కాదని... కరోనా వచ్చిందంటూ సాఫ్ట్‌వేర్‌ కార్యాలయాన్ని ఖాళీ చేశారని చెప్పారు. ఎప్పుడూ అతిగా స్పందించవద్దంటూ హితవు పలికారు. ఇప్పటివరకు తెలంగాణలో ఒక్కరికి కూడా కరోనా రాలేదని... గాంధీలో ఉన్న వ్యక్తికి కరోనా దుబాయిలో వచ్చిందని తెలిపారు. ఆ వ్యక్తి రెండ్రోజుల్లో డిశ్చార్జ్‌ అవ్వచ్చొని చెప్పారు.

మొత్తం 21 నమూనాలు నెగిటివ్‌ వచ్చాయని... ఈరోజు కొత్తగా 10 నమూనాలు తీసుకున్నారని పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు మాకు పరీక్షలు చేయండి అంటున్నారని... ఆ విధంగా ఇన్ఫెక్షన్​ లేకున్నా పరీక్షలు చేయడం కుదరదని ఈటల చెప్పారు. ఆస్పత్రిలో జాయిన్‌ అవ్వాలంటే కచ్చితంగా లక్షణాలు ఉండాలని ఆయన అన్నారు. ఐసోలేషన్‌కు సిద్ధంగా ఉన్నామని అన్ని మెడికల్‌ కళాశాలలు చెప్పాయని పేర్కొన్నారు. రెండు పరీక్షలు నెగిటివ్‌ వచ్చాయని రిలాక్స్‌ అవ్వట్లేదని... అన్ని విభాగాలు, తాము ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు.

'ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనే సత్తా ఉంది'

ఇవీ చూడండి: ప్రైవేటు ఆస్పత్రికి కరోనా సోకిన ఇటలీ పర్యటకులు

Last Updated : Mar 5, 2020, 9:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.