కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో స్వస్థలాలకు చేరుకునేందుకు వలస కూలీల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆంక్షల మినహాయింపు సమయాల్లో రైల్వేస్టేషన్లు, బస్టాండులకు చేరుకుంటున్నా.. గమ్యస్థానాలకు చేరుకునేందుకు మాత్రం కష్టాలు తప్పడం లేదు. ప్రధానంగా సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లలో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. రైళ్లు, బస్సులు సమయానికి దొరక్కపోవటంతో.. ముందుకెళ్లక, వెనుదిరగ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆటోవాలాలు ఇదే అదునుగా ప్రయాణికుల నుంచి తక్కువ దూరానికే భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. చేసేది లేక ప్రయాణికులు అక్కడే ఉండిపోవాల్సి వస్తోంది. ఉదయం 6 గంటలకు ఆంక్షల సడలింపు మొదలవుతుందని... అప్పుడు ఆర్టీసీ బస్సుల్లో తమ గమ్యస్థానాలకు వెళ్తామని చెబుతున్నారు. మరోవైపు ఫుట్పాత్లపై, బస్టాండుల్లో నిద్రిస్తున్న వలస కూలీల పట్ల జేబు దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు.
ఇదీ చదవండి: బ్లాక్ఫంగస్ కేసుల తీవ్రత దృష్ట్యా అప్రమత్తమైన ప్రభుత్వం