ETV Bharat / state

కంటైన్​మెంట్​ ప్రాంతాల్లో పర్యటించిన మేయర్ బొంతు రామ్మోహన్

హైదరాబాద్​లో దోమలగూడ కంటైన్​మెంట్ జోన్​ చెక్​పోస్ట్​లో నగర మేయర్​ బొంతు రామ్మోహన్​ పర్యటించి... ప్రజలెవరూ బయటకు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం మల్లాపూర్​లో 300 మంది జీహెచ్​ఎంసీ కార్మికులకు నిత్యావసరాలను అందజేశారు.

author img

By

Published : Apr 16, 2020, 8:04 PM IST

mayor bonthu rammohanrao visited containment areas in hyderabad
కంటైన్​మెంట్​ ప్రాంతాల్లో పర్యటించిన మేయర్ బొంతు రామ్మోహన్

కరోనా కట్టడికోసం ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని నగర మేయర్​ బొంతు రామ్మోహన్​ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్​ దోమలగూడ కంటైన్​మెంట్​ జోన్​ చెక్​పోస్ట్​ను ఆయన తనిఖీ చేశారు. వివిధ కారణాలతో జోన్​ నుంచి బయటకు వెళ్లేందుకు వచ్చిన వ్యక్తులను మందలించారు.

ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని.. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వస్తే మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని సూచించారు. అనంతరం మల్లాపూర్​లో ఉన్న పౌరసరఫరాల సంస్థ గోడౌన్​ను పరిశీలించారు. హమాలీ యూనియన్​ ఆధ్వర్యంలో 300 మంది జీహెచ్​ఎంసీ కార్మికులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు.

కరోనా కట్టడికోసం ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని నగర మేయర్​ బొంతు రామ్మోహన్​ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్​ దోమలగూడ కంటైన్​మెంట్​ జోన్​ చెక్​పోస్ట్​ను ఆయన తనిఖీ చేశారు. వివిధ కారణాలతో జోన్​ నుంచి బయటకు వెళ్లేందుకు వచ్చిన వ్యక్తులను మందలించారు.

ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని.. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వస్తే మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని సూచించారు. అనంతరం మల్లాపూర్​లో ఉన్న పౌరసరఫరాల సంస్థ గోడౌన్​ను పరిశీలించారు. హమాలీ యూనియన్​ ఆధ్వర్యంలో 300 మంది జీహెచ్​ఎంసీ కార్మికులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు.

ఇదీ చదవండిః ఈటీవీ కథనానికి స్పందన.. బుడగ జంగాల కూలీలకు సాయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.