హైదరాబాద్ నారాయణగూడలోని రాష్ట్ర పద్మశాలి భవన్లో మార్కండేయ జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. స్వామి వారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీవర్స్ వెలిఫెర్ ట్రస్ట్ సామాజిక విభాగం ఆధ్వర్యంలోని ఈ వేడుకలు అందర్నీ ఆకర్షించాయి.
ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మ్యాడం బాబూరావుతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు. ఏటా మార్కండేయ జయంతిని ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు సహకరించిన సంఘం సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి: హైదరాబాద్ యూటీపై క్లారిటీ ఇచ్చిన కిషన్రెడ్డి