కొహెడ మార్కెట్లో ఈ నెల 30వ తేదీ నుంచి మామిడి క్రయవిక్రయాలు ప్రారంభమవుతాయని గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రామ్ నర్సింహా గౌడ్ చెప్పారు. గురువారం రోజునే గడ్డి అన్నారం నుంచి పండ్ల మార్కెట్ను కొహెడకు మార్చామన్నారు. ఇప్పటికే యుద్ద ప్రాతిపదికన తాత్కాలిక షెడ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ లోగా రైతులు తొందరపడి మామిడి, ఇతర పండ్లు ముందస్తుగా తీసుకురావద్దని ఆయన సూచించారు.
ఇదీ చదవండి: కరోనా వేళ 'మూర్తీ'భవించిన మానవత్వం