రంగారెడ్డి జిల్లాలో ప్రతి 1000 మంది పురుషులకు 1024 మంది మహిళలుండగా.. మేడ్చల్ మల్కాజిగిరిలో 828 మందే ఉండడం గమనార్హం. ఈ రెండు జిల్లాల్లోనూ అక్షరాస్యత గతం కంటే పెరిగింది. రంగారెడ్డిలో 72.1, మేడ్చల్లో 79.5 శాతంగా ఉన్నట్లు తేలింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కేంద్ర ఆరోగ్య సంక్షేమశాఖ నిర్వహించిన జాతీయ కుటుంబ సర్వే-5లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
ఎప్పుడు చేశారంటే..
2019 జూన్ 30 నుంచి నవంబరు 14 వరకు 27,351 కుటుంబాల్లోని 27,518 మంది మహిళలు, 3863 మంది పురుషులతో ఈ సర్వే చేపట్టారు. తాజాగా వివరాలు వెల్లడించారు.
అయిదేళ్ల తర్వాతే బడికి..
మూడు జిల్లాల పరిధిలో గతంలో మూడేళ్లు నిండగానే పిల్లలను బడికి పంపే తల్లిదండ్రులు ఇప్పుడు ఆరేళ్లు వస్తేగానీ పంపట్లేదని అధ్యయనంలో వెల్లడైంది. ఈ లెక్కన హైదరాబాద్లో పూర్వ ప్రాథమిక విద్యార్థుల శాతం 19.96% నమోదు కాగా.. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో 19.8% మంది మాత్రమే వెళ్తున్నారు.
కుటుంబ నియంత్రణకే..
మూడు జిల్లాల పరిధిలో మహిళలు వివిధ పద్ధతుల్లో గర్భం దాల్చకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారని తేలింది. హైదరాబాద్లో 76.4% మంది ఏ పద్ధతి అయినా ఫర్వాలేదని భావిస్తున్నారు. 1.4% మంది మాత్రలు వాడుతున్నారు. అలానే 12 నుంచి 23 నెలల మధ్య ఉన్న శిశువుల్లో హైదరాబాద్ పరిధిలో 84.3% మందికి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో, 5.3% మందికి ప్రైవేట్ ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు వేయిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ కేంద్రాల్లో 92.8%, ప్రైవేట్ కేంద్రాల్లో 7.2%, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ప్రభుత్వ కేంద్రాల్లో 81.9%, ప్రైవేటు కేంద్రాల్లో 18.1% మందికి టీకాలు వేయిస్తున్నారు.
![అతివలూ శెభాష్](https://assets.eenadu.net/article_img/Capture1_446.jpg)