ETV Bharat / state

విమోచనం మతానికి సంబంధించింది కాదు...!

తెలంగాణ విమోచనదినం మతానికి సంబంధించింది కాదని.. మన హక్కులు, భావాలు కాపాడుకోవడమేనని  హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. బేగంపేట్​లో ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో జరిగిన మహాదినోత్సవ సభకు దత్తాత్రేయ, కేంద్ర హోంశాఖ సహాయశాఖ మంత్రి కిషన్​రెడ్డి ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.

author img

By

Published : Sep 16, 2019, 5:02 AM IST

విమోచనం మతానికి సంబంధించింది కాదు...!

హైదరాబాద్ బేగంపేట్​లో వైదిక ఆశ్రమ కన్యాగురుకులంలో ఆర్యసమాజ్.. మహా దినోత్సవసభను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హిమచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి ముఖ్య అతిథిలుగా హజరయ్యారు. తెలంగాణ విమోచనదినం మతానికి సంబంధించింది కాదని.. మన హక్కులను , భావాలను కాపాడుకోవడమేనని దత్తాత్రేయ అన్నారు. ఆర్యసమాజ్ సంస్థకు ఉన్న 680 ఎకరాల విలువైన స్థలాలను కొంతమంది కబ్జా చేయాలని చూస్తున్నారని.. వాటిని కాపాడాలని కిషన్​ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. హిందూ, భారతీయ సంస్థల్లో సాంఘీక దురాచారాలను పారద్రోలిన సంస్థ ఆర్యసమాజ్ అని కిషన్ రెడ్డి కొనియాడారు. సత్యం, ధర్మం కోసం హిందువులు, భారతీయులను ఒక వేదిక మీదికి తీసుకవచ్చిందని కిషన్​ రెడ్డి ప్రశంసించారు.

విమోచనం మతానికి సంబంధించింది కాదు...!

ఇదీచూడండి: గతంలోనూ ఘటనలు.. నీటిపాలైన ప్రాణాలు!

హైదరాబాద్ బేగంపేట్​లో వైదిక ఆశ్రమ కన్యాగురుకులంలో ఆర్యసమాజ్.. మహా దినోత్సవసభను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హిమచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి ముఖ్య అతిథిలుగా హజరయ్యారు. తెలంగాణ విమోచనదినం మతానికి సంబంధించింది కాదని.. మన హక్కులను , భావాలను కాపాడుకోవడమేనని దత్తాత్రేయ అన్నారు. ఆర్యసమాజ్ సంస్థకు ఉన్న 680 ఎకరాల విలువైన స్థలాలను కొంతమంది కబ్జా చేయాలని చూస్తున్నారని.. వాటిని కాపాడాలని కిషన్​ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. హిందూ, భారతీయ సంస్థల్లో సాంఘీక దురాచారాలను పారద్రోలిన సంస్థ ఆర్యసమాజ్ అని కిషన్ రెడ్డి కొనియాడారు. సత్యం, ధర్మం కోసం హిందువులు, భారతీయులను ఒక వేదిక మీదికి తీసుకవచ్చిందని కిషన్​ రెడ్డి ప్రశంసించారు.

విమోచనం మతానికి సంబంధించింది కాదు...!

ఇదీచూడండి: గతంలోనూ ఘటనలు.. నీటిపాలైన ప్రాణాలు!

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.