ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద వామపక్షాలు సామూహిక నిరాహార దీక్ష చేపట్టాయి. దీక్షలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొన్నారు. ఆర్టీసీ సమ్మె కేవలం హక్కుల కోసం జరుగుతోంది కాదని.. తెలంగాణ సమాజం కోసం జరుగుతున్న సమ్మె అని తెలిపారు. ఆర్టీసీని ప్రైవేటీకరిస్తున్నామని ముఖ్యమంత్రి బహిరంగంగా చెబుతున్నారని, ఇది తెలంగాణకే ప్రమాదమని చెప్పారు.
ఇదీ చూడండి: ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష