ETV Bharat / state

Kishan Reddy Letter On Railway Minister : 'ఆ 2 రైల్వే స్టేషన్లలో కూడా రైళ్లు ఆపాలి'

author img

By

Published : May 14, 2023, 5:28 PM IST

Kishan Reddy Letter To Railway Minister : రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్​కు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్​ రెడ్డి లేఖ రాశారు. మహబూబ్​నగర్​, షాద్​ నగర్​ రైల్వే స్టేషన్లలో రైళ్లను ఆపాలని రైల్వే మంత్రిని కోరారు. ఈ లైన్​లో వేసిన ప్రాజెక్టును ప్రధాని జాతికి అంకితం చేశారని కిషన్​రెడ్డి గుర్తు చేశారు.

Kishan Reddy
Kishan Reddy

Kishan Reddy Letter To Railway Minister : మహబూబ్​నగర్​, షాద్​నగర్​ రైల్వే స్టేషన్లలలో రైళ్లను ఆపాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్​కు కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి లేఖ కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత నెల హైదరాబాద్​ పర్యటనలో భాగంగా రూ. 1,410 కోట్లతో చేసిన విద్యుద్దీకరించిన డబ్లింగ్​ రైల్​ ప్రాజెక్ట్​ను జాతికి అంకితం చేసిన విషయాన్ని ప్రధానంగా కిషన్​ రెడ్డి లేఖలో ప్రస్తావించారు. ఆ ప్రాజెక్టు వల్ల సికింద్రాబాద్​ - మహబూబ్​నగర్​ మధ్య 85 కిలో మీటర్ల పొడవున ఈ పనులను చేశారు.

Kishan Reddy letter : అయితే యశ్వంత్​ పూర్​ - హజరత్​ నిజాముద్దీన్​ ప్రయాణించే సంపర్క్​ క్రాంతి ఎక్స్​ప్రెస్​ రైలును కాచిగూడ నుంచి బయలుదేరిన తర్వాత తిరిగి కర్నూల్​లోనే ఆగుతోందని కిషన్​ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. దాదాపు 200 కిలోమీటర్ల వరకు ఎక్కడా స్టాప్​ లేని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ మధ్యలో ఉన్న మహబూబ్​నగర్​ రైల్వే స్టేషన్​లలో ఈ రైలుకు స్టాప్​ ఏర్పాటు చేయాలని కోరారు. తద్వారా దిల్లీ, బెంగళూరు వంటి సుదూర ప్రాంతాలకు ప్రయాణించే మహబూబ్​నగర్​ ప్రాంత ప్రజలు హైదరాబాద్​కు దాదాపు 4 గంటలు ప్రయాణించి రావాల్సిన అవసరం ఉందన్నారు.

తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలి: వీటితో పాటుగా చెంగల్​ పట్టు - కాచిగూడ ఎక్స్​ప్రెస్​కు షాద్​నగర్​ రైల్వే స్టేషన్​లో స్టాప్​ ఏర్పాటు చేసినట్లయితే.. హైదరాబాద్​ సబర్బన్​ ప్రాంతాలలోని ప్రయాణికులకు ప్రయాణం సులభతరం అవుతుందని అన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలోని తిమ్మాపూర్​, కొత్తూరు, బూర్గుల తదితర ప్రాంతాల ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందని లేఖలో కిషన్​రెడ్డి వివరించారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర మంత్రి రైల్వే శాఖ మంత్రి కోరారు.

రాష్ట్రంలో రైల్వే మౌలిక వసతులు భేష్​: రాష్ట్రంలో రైల్వే శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ కార్యక్రమాలను ప్రస్తావిస్తూ.. ఇంత వరకూ అందించిన, అందిస్తున్న అన్ని రకాల సహాయ సహకారాలకు కిషన్​రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణలో రైల్వేల పరంగా గణనీయమైన పురోగతి జరుగుతోందని వెల్లడించారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి రాష్ట్రంలో రైల్వే మౌలిక వసతులు కల్పన వేగవంతంగా జరుగుతోందని హర్షం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

Kishan Reddy Letter To Railway Minister : మహబూబ్​నగర్​, షాద్​నగర్​ రైల్వే స్టేషన్లలలో రైళ్లను ఆపాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్​కు కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి లేఖ కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత నెల హైదరాబాద్​ పర్యటనలో భాగంగా రూ. 1,410 కోట్లతో చేసిన విద్యుద్దీకరించిన డబ్లింగ్​ రైల్​ ప్రాజెక్ట్​ను జాతికి అంకితం చేసిన విషయాన్ని ప్రధానంగా కిషన్​ రెడ్డి లేఖలో ప్రస్తావించారు. ఆ ప్రాజెక్టు వల్ల సికింద్రాబాద్​ - మహబూబ్​నగర్​ మధ్య 85 కిలో మీటర్ల పొడవున ఈ పనులను చేశారు.

Kishan Reddy letter : అయితే యశ్వంత్​ పూర్​ - హజరత్​ నిజాముద్దీన్​ ప్రయాణించే సంపర్క్​ క్రాంతి ఎక్స్​ప్రెస్​ రైలును కాచిగూడ నుంచి బయలుదేరిన తర్వాత తిరిగి కర్నూల్​లోనే ఆగుతోందని కిషన్​ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. దాదాపు 200 కిలోమీటర్ల వరకు ఎక్కడా స్టాప్​ లేని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ మధ్యలో ఉన్న మహబూబ్​నగర్​ రైల్వే స్టేషన్​లలో ఈ రైలుకు స్టాప్​ ఏర్పాటు చేయాలని కోరారు. తద్వారా దిల్లీ, బెంగళూరు వంటి సుదూర ప్రాంతాలకు ప్రయాణించే మహబూబ్​నగర్​ ప్రాంత ప్రజలు హైదరాబాద్​కు దాదాపు 4 గంటలు ప్రయాణించి రావాల్సిన అవసరం ఉందన్నారు.

తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలి: వీటితో పాటుగా చెంగల్​ పట్టు - కాచిగూడ ఎక్స్​ప్రెస్​కు షాద్​నగర్​ రైల్వే స్టేషన్​లో స్టాప్​ ఏర్పాటు చేసినట్లయితే.. హైదరాబాద్​ సబర్బన్​ ప్రాంతాలలోని ప్రయాణికులకు ప్రయాణం సులభతరం అవుతుందని అన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలోని తిమ్మాపూర్​, కొత్తూరు, బూర్గుల తదితర ప్రాంతాల ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందని లేఖలో కిషన్​రెడ్డి వివరించారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర మంత్రి రైల్వే శాఖ మంత్రి కోరారు.

రాష్ట్రంలో రైల్వే మౌలిక వసతులు భేష్​: రాష్ట్రంలో రైల్వే శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ కార్యక్రమాలను ప్రస్తావిస్తూ.. ఇంత వరకూ అందించిన, అందిస్తున్న అన్ని రకాల సహాయ సహకారాలకు కిషన్​రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణలో రైల్వేల పరంగా గణనీయమైన పురోగతి జరుగుతోందని వెల్లడించారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి రాష్ట్రంలో రైల్వే మౌలిక వసతులు కల్పన వేగవంతంగా జరుగుతోందని హర్షం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.