ETV Bharat / state

ఐడీపీఎల్‌ పునరుద్ధరణ కోసం.. త్వరలో ప్రధానికి కేసీఆర్‌ లేఖ

author img

By

Published : May 27, 2021, 8:41 AM IST

కొవిడ్‌ నేపథ్యంలో పెద్దఎత్తున ఆక్సిజన్‌ ఉత్పత్తి చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మూతపడిన ప్లాంట్ల పునరుద్ధరణ, కొత్తవి నెలకొల్పడం లక్ష్యంగా ముందుకెళ్తోంది. రాష్ట్రంలో ప్రైవేటు రంగంలోనే ఆక్సిజన్‌ ఉత్పత్తి జరుగుతోంది. ప్రస్తుతం 3 ప్రైవేటు సంస్థలు 120 టన్నులు తయారు చేస్తున్నాయి. మరో 600 టన్నుల ఉత్పత్తి సాధించేందుకు చర్యలు చేపట్టింది.

ఐడీపీఎల్‌ పునరుద్ధరణ కోసం.. త్వరలో ప్రధానికి కేసీఆర్‌ లేఖ
kcr-letter-to-the-prime-minister-soon-on-idpl-renewal

రాష్ట్రంలోని పరిశ్రమలు, వైద్యఆరోగ్యశాఖలతో పాటు పారిశ్రామిక వర్గాలు, ఉత్పత్తి సంస్థలు ఆక్సిజన్ ఉత్పత్తి కోసం పాలుపంచుకోనున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఐడీపీఎల్‌ (ఇండియన్‌ డ్రగ్స్‌, ఫార్మాసూటికల్స్‌ లిమిటెడ్‌) సహకారం కూడా తీసుకోనుంది. గతంలో అంతగా వినియోగం లేకపోవడం వల్ల రాష్ట్రంలో పలు సంస్థలు ఉత్పత్తిని నిలిపివేశాయి. ప్రస్తుతం పదికి పైగా ప్లాంట్లు నిరుపయోగంగా ఉన్నాయి. పారిశ్రామిక, వైద్య అవసరాలకు ఆంధ్రప్రదేశ్‌, ఇతర రాష్ట్రాల నుంచి ప్రాణవాయివును తెప్పించుకుంటున్నాం. తాజాగా రెండో విడత కరోనా ఉద్ధృతిలో కేంద్రం... ఒడిశా, తమిళనాడు, కర్ణాటకల నుంచి కేటాయించింది. ఒడిశా మినహా మిగిలిన రాష్ట్రాల నుంచి సహకారం లేకపోవడంతో ఆక్సిజన్‌ కొరత ఏర్పడింది.

కలిసొచ్చిన పారిశ్రామికవర్గాలు

పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. పారిశ్రామికవర్గాలు కొత్త వాటి ఏర్పాటుకు ముందుకు రావడంతో పాటు మూతపడిన ప్లాంట్ల వివరాలను అందించాయి. సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌, గజ్వేల్‌, జోగిపేటలలో ఒక్కో ప్లాంటు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సంస్థలు ముందుకొస్తే ప్రభుత్వం మూడు నెలల్లో అనుమతులు ఇవ్వనుంది.

గ్రీన్‌కోకు పాశమైలారం బాధ్యతలు

ఆక్సిజన్‌ ఉత్పత్తిలో అనుభవం గల గ్రీన్‌కో సంస్థకు పాశమైలారంలో మూతపడిన 40 టన్నుల ప్లాంటు పునరుద్ధరణ బాధ్యతలను అప్పగించింది. సంస్థ యాజమాన్యం, గ్రీన్‌కోల మధ్య ఒప్పందం కుదిరింది. గ్రీన్‌కో సంస్థ జర్మనీ, బెల్జియం, అమెరికాల నుంచి అధునాతన యంత్రాలను తెప్పించింది.

ఐడీపీఎల్‌...

హైదరాబాద్‌ బాలానగర్‌లోని ఐడీపీఎల్‌ యూనిట్‌టో పారిశ్రామిక అవసరాల కోసం 60 టన్నుల సామర్థ్యం గల ఆక్సిజన్‌ ప్లాంటు ఉంది. ఐడీపీఎల్‌ 2003లో మూతపడగా.. ఆక్సిజన్‌ ప్లాంటునూ ఆపేశారు. దీని పునరుద్ధరణపై ప్రధానికి సీఎం కేసీఆర్‌ లేఖ రాయనున్నారు. కేంద్ర పెట్రో, రసాయనాల శాఖ మంత్రి సదానందగౌడకు కేటీఆర్‌ లేఖ రాస్తారు. ఈ ప్లాంటు పునరుద్ధరణను కేంద్రం చేపట్టిన పక్షంలో సహకరిస్తామని తెలియజేయనున్నారు. కేంద్రం ప్లాంటును తమకు అప్పగించినా పునరుద్ధరణ బాధ్యతలను చేపడతామని సంసిద్ధత తెలపనున్నారు.

మొత్తం పూర్తయితే...

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో 324 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం ఆదేశాల మేరకు మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో ఈ పనులు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 324 టన్నులు, అయిదు కొత్త ప్లాంట్ల ద్వారా 100 టన్నులు, పునరుద్ధరణలో భాగంగా ఐడీపీఎల్‌ నుంచి 60 టన్నులు, పాశమైలారం గ్రీన్‌ ప్లాంట్‌ ద్వారా 40 టన్నులు, పునరుద్ధరించనున్న మరో నాలుగు ప్లాంట్ల ద్వారా 80 టన్నులు అందుబాటులోకి వస్తే మొత్తం 600 టన్నులకు పైగా ఆక్సిజన్‌ లభ్యమవుతుందని ప్రభుత్వవర్గాలు భావిస్తున్నాయి.

ఇదీ చూడండి: Vaccination: సూపర్‌ స్ప్రెడర్లకు టీకా.. కసరత్తు ప్రారంభించిన సర్కారు

రాష్ట్రంలోని పరిశ్రమలు, వైద్యఆరోగ్యశాఖలతో పాటు పారిశ్రామిక వర్గాలు, ఉత్పత్తి సంస్థలు ఆక్సిజన్ ఉత్పత్తి కోసం పాలుపంచుకోనున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఐడీపీఎల్‌ (ఇండియన్‌ డ్రగ్స్‌, ఫార్మాసూటికల్స్‌ లిమిటెడ్‌) సహకారం కూడా తీసుకోనుంది. గతంలో అంతగా వినియోగం లేకపోవడం వల్ల రాష్ట్రంలో పలు సంస్థలు ఉత్పత్తిని నిలిపివేశాయి. ప్రస్తుతం పదికి పైగా ప్లాంట్లు నిరుపయోగంగా ఉన్నాయి. పారిశ్రామిక, వైద్య అవసరాలకు ఆంధ్రప్రదేశ్‌, ఇతర రాష్ట్రాల నుంచి ప్రాణవాయివును తెప్పించుకుంటున్నాం. తాజాగా రెండో విడత కరోనా ఉద్ధృతిలో కేంద్రం... ఒడిశా, తమిళనాడు, కర్ణాటకల నుంచి కేటాయించింది. ఒడిశా మినహా మిగిలిన రాష్ట్రాల నుంచి సహకారం లేకపోవడంతో ఆక్సిజన్‌ కొరత ఏర్పడింది.

కలిసొచ్చిన పారిశ్రామికవర్గాలు

పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. పారిశ్రామికవర్గాలు కొత్త వాటి ఏర్పాటుకు ముందుకు రావడంతో పాటు మూతపడిన ప్లాంట్ల వివరాలను అందించాయి. సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్‌, గజ్వేల్‌, జోగిపేటలలో ఒక్కో ప్లాంటు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సంస్థలు ముందుకొస్తే ప్రభుత్వం మూడు నెలల్లో అనుమతులు ఇవ్వనుంది.

గ్రీన్‌కోకు పాశమైలారం బాధ్యతలు

ఆక్సిజన్‌ ఉత్పత్తిలో అనుభవం గల గ్రీన్‌కో సంస్థకు పాశమైలారంలో మూతపడిన 40 టన్నుల ప్లాంటు పునరుద్ధరణ బాధ్యతలను అప్పగించింది. సంస్థ యాజమాన్యం, గ్రీన్‌కోల మధ్య ఒప్పందం కుదిరింది. గ్రీన్‌కో సంస్థ జర్మనీ, బెల్జియం, అమెరికాల నుంచి అధునాతన యంత్రాలను తెప్పించింది.

ఐడీపీఎల్‌...

హైదరాబాద్‌ బాలానగర్‌లోని ఐడీపీఎల్‌ యూనిట్‌టో పారిశ్రామిక అవసరాల కోసం 60 టన్నుల సామర్థ్యం గల ఆక్సిజన్‌ ప్లాంటు ఉంది. ఐడీపీఎల్‌ 2003లో మూతపడగా.. ఆక్సిజన్‌ ప్లాంటునూ ఆపేశారు. దీని పునరుద్ధరణపై ప్రధానికి సీఎం కేసీఆర్‌ లేఖ రాయనున్నారు. కేంద్ర పెట్రో, రసాయనాల శాఖ మంత్రి సదానందగౌడకు కేటీఆర్‌ లేఖ రాస్తారు. ఈ ప్లాంటు పునరుద్ధరణను కేంద్రం చేపట్టిన పక్షంలో సహకరిస్తామని తెలియజేయనున్నారు. కేంద్రం ప్లాంటును తమకు అప్పగించినా పునరుద్ధరణ బాధ్యతలను చేపడతామని సంసిద్ధత తెలపనున్నారు.

మొత్తం పూర్తయితే...

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో 324 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం ఆదేశాల మేరకు మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో ఈ పనులు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 324 టన్నులు, అయిదు కొత్త ప్లాంట్ల ద్వారా 100 టన్నులు, పునరుద్ధరణలో భాగంగా ఐడీపీఎల్‌ నుంచి 60 టన్నులు, పాశమైలారం గ్రీన్‌ ప్లాంట్‌ ద్వారా 40 టన్నులు, పునరుద్ధరించనున్న మరో నాలుగు ప్లాంట్ల ద్వారా 80 టన్నులు అందుబాటులోకి వస్తే మొత్తం 600 టన్నులకు పైగా ఆక్సిజన్‌ లభ్యమవుతుందని ప్రభుత్వవర్గాలు భావిస్తున్నాయి.

ఇదీ చూడండి: Vaccination: సూపర్‌ స్ప్రెడర్లకు టీకా.. కసరత్తు ప్రారంభించిన సర్కారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.