"కొన్ని రోజులుగా మహారాష్ట్రలోని కోయానా, ఇతర జలాశయాల నుంచి కృష్ణానదికి నీటిని విడుదల చేస్తున్నారు. అక్కడి నుంచి భారీ మొత్తంలో వరద నీటిని కర్ణాటకలోని ఆలమట్టి, నారాయణపూర్ జలాశయాలకు వదులుతోంది. ఆ రెండు జలాశయాల్లో నీటిమట్టం నిండిపోగా మిగులు ప్రవాహం లభిస్తోంది. అందుకే వాటిని కృష్ణ నదిలోకి వదులుతున్నాము. ప్రజలు, పంటలు, జలాశయం భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇవాళ ఉదయం నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి 2.7 లక్షల క్యూసెక్కుల నీటిని కృష్ణలోకి విడుదల చేశాం. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని, కృష్ణ బేసిన్కు సంబంధించిన జిల్లా పరిపాలన, ఆనకట్ట అధికారులకు తగిన జాగ్రత్త చర్యలను నిర్దేశించాలని కోరుతున్నాను."
- లేఖలో యడియూరప్ప
![Karnataka CM wrote a letter to KCR](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4049796_905_4049796_1565014777150.png)
ఇవీ చూడండి: లైవ్: 370 రద్దు తీర్మానానికి రాజ్యసభ ఆమోదం