హైదరాబాద్ కోఠి మెడికల్ కళాశాల ముందు తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆందోళనకు దిగింది. పీజీ మెడికల్ సీట్ల ఫీజులు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని జూడాలు డిమాండ్ చేశారు. కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలయ్యాక ఫీజులు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు వారు తెలిపారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు అనుకూలంగా ఫీజులు పెంచారని ఆరోపించారు.
2017లో పెంచిన ఫీజులపై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు.. పూర్తి జడ్జిమెంట్ రాక ముందే ఫీజులు ఎలా పెంచుతారని ప్రశ్నించారు. ఈ ఫీజుల పెంపుపై తీసుకొచ్చిన జీవో 28ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కరోనాతో పోరాడే వైద్యులు.. ఇప్పుడు ఈ ఫీజు పెంపుతో పోరాడాలా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఇదీచూడండి: విశాఖ ఘటనపై ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష