ఐటీగ్రిడ్ ఎండీ అశోక్ ముందస్తు బెయిల్ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో రంగారెడ్డి జిల్లా కోర్టు ఆయన బెయిల్ పిటిషన్ను కొట్టివేయగా.. హైకోర్టును ముందస్తు బెయిల్ కోసం ఆశ్రయించారు. ఈ కేసులో వాదనలు వినిపించేందుకు మరికొంత గడువు కావాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టును కోరారు. తదుపరి విచారణను హైకోర్టు జూన్ 4వ తేదీకి వాయిదా వేసింది.
ఇదీ చూడండి: 'సున్నా వేయడం వాళ్ల హక్కు... అంతే వేస్తాం'