ETV Bharat / state

రుణం పేరుతో ఎంపీ కేకేకు మస్కా..సూత్రధారి ఓ విలేకరి ! - రుణం పేరుతో ఎంపీ కేకేకు మోసం యత్నం వెనుక ఓ విలేకరి !

కేంద్ర ప్రభుత్వ రుణం పేరుతో ఎంపీ కె. కేశవరావును మోసం చేసేందుకు యత్నించిన ఘటనలో ఓ విలేకరి మూలసూత్రధారిగా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఎంపీకు ఫోన్‌ చేసిన నంబరు పనిచేస్తుండగా పోలీసులు సదరు మహేష్‌తో మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే ఆయన మోసం చేసి తీసుకున్న డబ్బులను తిరిగి బాధితుడు అఖిల్‌కుమార్‌ ఖాతాలో వేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

police suspecting a reporterin mp kk phone call case
రుణం పేరుతో ఎంపీ కేకేకు మోసం యత్నం వెనుక ఓ విలేకరి !
author img

By

Published : Aug 28, 2020, 8:06 AM IST

కేంద్ర ప్రభుత్వ రుణం పేరుతో రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావును మోసం చేసేందుకు ప్రయత్నించిన సంఘటనలో ఒక విలేకరి కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. అతనితోపాటు మరో యువకుడు ఈ వ్యవహారంలో పాలుపంచుకున్నట్లు సమాచారం. సదరు విలేకరి మహేష్‌ పేరుతో ఫోన్‌ చేసి కేంద్ర ప్రభుత్వ పరిశ్రమల శాఖలో డిప్యూటీ డైరక్టర్‌ను అంటూ నమ్మించడం, కేటీఆర్‌ పేరును ప్రస్తావించడంతోపాటు ఏకంగా ఎంపీ కేకేను లక్ష్యంగా చేసుకోవడం వల్ల ఈ కేసుపై బంజారాహిల్స్‌ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.

ప్రాథమిక దర్యాప్తులో భాగంగా కీలక అంశాలను గుర్తించారు. నిజామాబాద్‌ ప్రాంతంలోని ఒక విలేకరి ఈ వ్యవహారానికి మూలసూత్రధారిగా అనుమానిస్తున్నారు. కాగా కేకేకు ఫోన్‌ చేసిన నంబరు పనిచేస్తుండగా పోలీసులు సదరు మహేష్‌తో మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే ఆయన మోసం చేసి తీసుకున్న డబ్బులను తిరిగి బాధితుడు అఖిల్‌కుమార్‌ ఖాతాలో వేసినట్లు పోలీసులు చెబుతున్నారు. మరింతమంది ఎంపీలను సైతం ఇలాగే మోసం చేసి ఉంటారనే అనుమానంతో వారిని పట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వ రుణం పేరుతో రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావును మోసం చేసేందుకు ప్రయత్నించిన సంఘటనలో ఒక విలేకరి కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. అతనితోపాటు మరో యువకుడు ఈ వ్యవహారంలో పాలుపంచుకున్నట్లు సమాచారం. సదరు విలేకరి మహేష్‌ పేరుతో ఫోన్‌ చేసి కేంద్ర ప్రభుత్వ పరిశ్రమల శాఖలో డిప్యూటీ డైరక్టర్‌ను అంటూ నమ్మించడం, కేటీఆర్‌ పేరును ప్రస్తావించడంతోపాటు ఏకంగా ఎంపీ కేకేను లక్ష్యంగా చేసుకోవడం వల్ల ఈ కేసుపై బంజారాహిల్స్‌ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.

ప్రాథమిక దర్యాప్తులో భాగంగా కీలక అంశాలను గుర్తించారు. నిజామాబాద్‌ ప్రాంతంలోని ఒక విలేకరి ఈ వ్యవహారానికి మూలసూత్రధారిగా అనుమానిస్తున్నారు. కాగా కేకేకు ఫోన్‌ చేసిన నంబరు పనిచేస్తుండగా పోలీసులు సదరు మహేష్‌తో మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే ఆయన మోసం చేసి తీసుకున్న డబ్బులను తిరిగి బాధితుడు అఖిల్‌కుమార్‌ ఖాతాలో వేసినట్లు పోలీసులు చెబుతున్నారు. మరింతమంది ఎంపీలను సైతం ఇలాగే మోసం చేసి ఉంటారనే అనుమానంతో వారిని పట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇదీ చూడండి: కర్ణాటకలో కరోనా కల్లోలం- ఒక్కరోజే 9 వేల కేసులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.