ETV Bharat / state

వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యలకు చెక్​పెట్టేందుకు విద్యుత్​శాఖ ప్లాన్​ ఏంటి..?

మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. అధికారులతో ప్రస్తుత పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. ముందస్తు ఏర్పాట్లు చేస్తుంది. వరదల ప్రభావ ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల వద్ద అధికారులను అప్రమత్తం చేసింది. వర్షాకాల నేపథ్యంలో విద్యుత్ శాఖ ముందస్తు ఏర్పాట్లపై ట్రాన్స్ కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు, ఎస్పీడీసీఎల్ సీఎండీలో ఈటీవీ-భారత్ ముఖాముఖీ.

author img

By

Published : Sep 7, 2021, 7:53 PM IST

transco cmd
transco cmd
వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యలకు చెక్​పెట్టేందుకు విద్యుత్​శాఖ ప్లాన్​ ఏంటి..?

ప్రశ్న : వర్షాకాల నేపథ్యంలో విద్యుత్ శాఖ ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకుంటుంది..?

జవాబు (రఘుమారెడ్డి, ఎస్పీడీసీఎల్ సీఎండీ ) : గత అనుభవాల నేపథ్యంలో ప్రతి సబ్ స్టేషన్, సెక్షన్ కార్యాలయంలో 20 నుంచి 30 విద్యుత్ స్తంభాలను అందుబాటులో ఉంచాం. మానవవనరులను కూడా అందుబాటులో ఉంచాం. ప్రతి డివిజన్​లో 20 మంది స్టాఫ్​ను 24 గంటల పాటు పనిచేసేవిధంగా ఏర్పాటు చేశాం. వీటికి అధనంగా డిజాస్టర్ మేనేజ్​మెంట్ టీంలను ఏర్పాటు చేశాం. ఈ బృందంలో ఇంజినీర్లు కూడా ఉంటారు. వారు ఎక్కువ వరదలు, వర్షాలు వచ్చినప్పుడు.. ఎప్పటికప్పుడు తక్షణమే సొంత వాహనాల్లో స్థానిక సర్కిల్ కార్యాలయానికి వెళ్లి... అక్కడి నుంచి అవసరమైన ప్రాంతానికి చేరుకుంటారు. అందుకోసం వాళ్లకు వాహనాలు కూడా సమకూర్చుతాం. వీరితో పాటు కాంట్రాక్టర్ల వద్ద పనిచేసే వారిని, ఇతర ఏజెన్సీలతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నాం. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ మాసాలకు ఇందుకోసం ప్రత్యేక అనుమతులు ఇచ్చాం.

ప్రశ్న: గతేడాది వరదలు, వర్షాలతో అపార్ట్​మెంట్ వాసులు భారీ వర్షాలతో రోజుల తరబడి విద్యుత్ లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత అనుభవాల దృష్ట్యా వారికి ఎటువంటి సలహాలు, సూచనలు ఇస్తున్నారు...?

జవాబు : గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి అపార్ట్​మెంట్​లోని వినియోగదారుడి వద్దకు వెళ్లాం. అక్కడి పరిస్థితులను స్వయంగా తెలుసుకున్నాం. సెల్లార్​లో ఉన్న మీటర్ బోర్డులను మార్చుకోవాలని విజ్ఞప్తి చేశాం. 60శాతం మంది అపార్ట్​మెంట్ వాసులు సెల్లార్ నుంచి మొదటి అంతస్తులోకి విద్యుత్ బోర్డులను మార్చుకున్నారు. మిగిలిన వాటిని ఈ ఏడాది అక్టోబర్ నాటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం.

ప్రశ్న: వర్షాలు, వరదల వల్ల విద్యుత్ స్తంభాలు కొట్టుకుపోవడం, విరిగిపోవడం వంటివి జరుగుతుంటాయి. ఇలాంటి సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం జరగకుండా ఎటువంటి జాగ్రతలు తీసుకుంటున్నారు?

జవాబు: గతేడాది సెప్టెంబర్​లో భారీ వర్షాలతో మూసీ పరివాహక ప్రాంతంలో సుమారు 1,500ల ట్రాన్స్ ఫార్మర్లు కొట్టుకుపోయాయి. తిరిగి వాటిని ఏర్పాటు చేసే సమయంలో వీలైనంత ఎత్తైన ప్రదేశంలో ఏర్పాటు చేశాం. అందువల్ల ఈసారి వరదలు వచ్చినా... ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వలేదు. ఈసారి వర్షాలు, వరదలతో మూసీ గేట్లు ఎత్తినప్పటికీ ఇబ్బందులు తలెత్తలేదు. ట్రాన్స్​ఫార్మర్లను లైన్లతో సహా ఎత్తైన ప్రదేశానికి షిప్ట్ చేశాం. ఇక ఈసారి వర్షాలు, వరదలకు గ్రామీణ జిల్లాలు, సర్కిళ్ల పరిధిలో 13 విద్యుత్ స్తంభాలు నేలకొరగటంతో పాటు... అయిదు డిస్ట్రీబ్యూషన్ ట్రాన్స్​ఫార్మర్లు దెబ్బతిన్నాయి.

ప్రశ్న: మరో మూడు నాలుగేళ్లలో స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయాలని కేంద్రం పేర్కొంది. వాటివల్ల డిస్కంలకు ఆర్థిక భారమవుతుందని భావిస్తున్నారా...?

జవాబు: ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేశాం. ఇప్పటికీ ఒక్క స్మార్ట్ మీటర్ పెట్టని రాష్ట్రాలు కూడా కొన్ని ఉన్నాయి. అటువంటి రాష్ట్రాల్లో ప్రీపెయిడ్​మోడ్​లో అడ్వాన్స్ చెల్లింపులు జరిగితే బాగుంటుందని సూచన చేశారు. అది మంచి నిర్ణయమే. డిస్కంలకు వినియోగదారులు సరైన సమయంలో బిల్లులు చెల్లించడంలేదు. దానివల్ల డిస్కంలకు కాస్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముందే చెల్లిస్తే విద్యుత్ సంస్థలకు వెసులుబాటు ఉంటుంది. అన్ని మీటర్లను ప్రీపెయిడ్ మోడ్ లో చేయడం ఖర్చుతో కూడుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రీపెయిడ్ మీటర్ల ఏర్పాటుకు రూ.11,500ల కోట్ల నిధులు అవసరమవుతాయి. కాబట్టి కేంద్రం ఏదైనా స్కీం తీసుకొచ్చి.. తద్వారా 80శాతం నుంచి 90శాతం వరకు గ్రాంట్ ఇస్తే.. డిస్కంలకు ఆర్థికంగా భారం కాకుండా ఉంటుంది.

ప్రశ్న: గతేడాది రికార్డ్ స్థాయిలో హైడల్ విద్యుత్​ను ఉత్పత్తి చేశాం. ఈసారి హైడల్ విద్యుత్ ఉత్పత్తి ఎలా కొనసాగుతుంది. గతేడాదిని మించి ఈసారి విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశాలు ఉన్నాయా..?

జవాబు (ప్రభాకర్ రావు , ట్రాన్స్ కో -జెన్కో సీఎండీ): ఈ ఏడాది వర్షాలు భారీగానే కురిసాయి. టార్గెట్​కు మించే విద్యుత్​ను ఉత్పత్తి చేశాం. వర్షాకాలం మరో రెండు మూడు నెలలు ఉంది. గత వారంలో దేశంలో విద్యుత్ కొరత ఉంది. అయినప్పటికీ మనకు హైడల్ విద్యుత్ ఉత్పత్తి ఉంది కాబట్టి... రిజర్వాయర్లలో ఇన్ ఫ్లో బాగానే ఉంది. కాబట్టి విద్యుత్​ను ఉత్పత్తి చేస్తున్నాం. నాగార్జున సాగర్, పోచంపాడ్, జూరాల, పులిచింతల వంటి హైడల్ ఉత్పత్తి కేంద్రాలలో కలిపి 2,441 హైడల్ విద్యుత్ ఉత్పత్తి కావాల్సి ఉంది. వీటిలో పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం. థర్మల్ పవర్ కూడా పీఎల్ఎఫ్​లో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నాం.

ప్రశ్న: ఈసారి 215 మిలియన్ యూనిట్ల విద్యుత్​ను ఎక్సేంజ్​లో అమ్మారు.. అదెలా సాధ్యమైంది...?

జవాబు: హైడల్, థర్మల్ ప్రాజెక్టులను నడుపుతూ... విద్యుత్ కొరత ఉన్న సమయంలో విద్యుత్​ను అమ్మి... విద్యుత్ సంస్థకు కొంత ఆర్థికంగా వెసులుబాటు కల్పించుకున్నాం. రాష్ట్ర పవర్​సెక్టార్​కు కొంత సాయమైంది. గత నెలలో 215 మిలియన్ యూనిట్ల విద్యుత్​ను ఎక్సేంజ్​లో అమ్మగలిగాం. తద్వారా సుమారు రూ.115 కోట్ల ఆదాయం వచ్చింది.

ప్రశ్న: భారీ వర్షాల నేపథ్యంలో పవర్ ప్లాంట్లలోకి నీళ్లు వచ్చి చేరిన ఘటనలు ఏమైనా చోటు చేసుకున్నాయా...?

జవాబు: కొత్తగూడెం పాల్వంచలో భారీ వర్షం కురిసింది. 18 సెంమీల వర్షాపాతం నమోదైంది. విద్యుత్ ప్లాంట్​ను ఆనుకుని కరకవాగు ఉంది. ప్లాంట్​లోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. వెంటనే ఇంజినీర్లు అప్రమత్తమై కాంపౌండ్ గోడను కూల్చివేసి..... నీటిని బయటకు పంపించారు. దీంతో ప్లాంట్​కు ఎటువంటి ఇబ్బందికలగలేదు. ప్రస్తుతం పాల్వంచలో విద్యుత్ ఉత్పత్తి సాధారణంగానే కొనసాగుతుంది.

ప్రశ్న: విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే అవసరమైన బొగ్గు అందుబాటులో ఉండాలి. నిరంతరంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బొగ్గు నిల్వల పరిస్థితి ఏవిధంగా ఉంది...?

జవాబు: ఇప్పటికే సీఎం కేసీఆర్... బొగ్గు నిల్వలకు సంబంధించి విద్యుత్ శాఖకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అవసరమైన బొగ్గును అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. దీంతో విద్యుత్ శాఖ అప్రమత్తమై 15 రోజులకు సరిపడా బొగ్గును అందుబాటులో ఉంచుకుంది. మన రాష్ట్రంలో అత్యధిక బొగ్గు ఓపెన్ కాస్ట్​ల ద్వారా ఉత్పత్తి కావడం వల్ల తడి బొగ్గు వస్తుంది. దీంతో కాస్త ఇబ్బంది అవుతుంది.

ఇదీ చూడండి: Power Purchase: 'కరెంట్​ను స్వేచ్ఛగా కొనుక్కునేందుకు వెసులుబాటు'

వర్షాకాలంలో ఎదురయ్యే సమస్యలకు చెక్​పెట్టేందుకు విద్యుత్​శాఖ ప్లాన్​ ఏంటి..?

ప్రశ్న : వర్షాకాల నేపథ్యంలో విద్యుత్ శాఖ ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకుంటుంది..?

జవాబు (రఘుమారెడ్డి, ఎస్పీడీసీఎల్ సీఎండీ ) : గత అనుభవాల నేపథ్యంలో ప్రతి సబ్ స్టేషన్, సెక్షన్ కార్యాలయంలో 20 నుంచి 30 విద్యుత్ స్తంభాలను అందుబాటులో ఉంచాం. మానవవనరులను కూడా అందుబాటులో ఉంచాం. ప్రతి డివిజన్​లో 20 మంది స్టాఫ్​ను 24 గంటల పాటు పనిచేసేవిధంగా ఏర్పాటు చేశాం. వీటికి అధనంగా డిజాస్టర్ మేనేజ్​మెంట్ టీంలను ఏర్పాటు చేశాం. ఈ బృందంలో ఇంజినీర్లు కూడా ఉంటారు. వారు ఎక్కువ వరదలు, వర్షాలు వచ్చినప్పుడు.. ఎప్పటికప్పుడు తక్షణమే సొంత వాహనాల్లో స్థానిక సర్కిల్ కార్యాలయానికి వెళ్లి... అక్కడి నుంచి అవసరమైన ప్రాంతానికి చేరుకుంటారు. అందుకోసం వాళ్లకు వాహనాలు కూడా సమకూర్చుతాం. వీరితో పాటు కాంట్రాక్టర్ల వద్ద పనిచేసే వారిని, ఇతర ఏజెన్సీలతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నాం. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ మాసాలకు ఇందుకోసం ప్రత్యేక అనుమతులు ఇచ్చాం.

ప్రశ్న: గతేడాది వరదలు, వర్షాలతో అపార్ట్​మెంట్ వాసులు భారీ వర్షాలతో రోజుల తరబడి విద్యుత్ లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత అనుభవాల దృష్ట్యా వారికి ఎటువంటి సలహాలు, సూచనలు ఇస్తున్నారు...?

జవాబు : గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి అపార్ట్​మెంట్​లోని వినియోగదారుడి వద్దకు వెళ్లాం. అక్కడి పరిస్థితులను స్వయంగా తెలుసుకున్నాం. సెల్లార్​లో ఉన్న మీటర్ బోర్డులను మార్చుకోవాలని విజ్ఞప్తి చేశాం. 60శాతం మంది అపార్ట్​మెంట్ వాసులు సెల్లార్ నుంచి మొదటి అంతస్తులోకి విద్యుత్ బోర్డులను మార్చుకున్నారు. మిగిలిన వాటిని ఈ ఏడాది అక్టోబర్ నాటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం.

ప్రశ్న: వర్షాలు, వరదల వల్ల విద్యుత్ స్తంభాలు కొట్టుకుపోవడం, విరిగిపోవడం వంటివి జరుగుతుంటాయి. ఇలాంటి సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం జరగకుండా ఎటువంటి జాగ్రతలు తీసుకుంటున్నారు?

జవాబు: గతేడాది సెప్టెంబర్​లో భారీ వర్షాలతో మూసీ పరివాహక ప్రాంతంలో సుమారు 1,500ల ట్రాన్స్ ఫార్మర్లు కొట్టుకుపోయాయి. తిరిగి వాటిని ఏర్పాటు చేసే సమయంలో వీలైనంత ఎత్తైన ప్రదేశంలో ఏర్పాటు చేశాం. అందువల్ల ఈసారి వరదలు వచ్చినా... ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వలేదు. ఈసారి వర్షాలు, వరదలతో మూసీ గేట్లు ఎత్తినప్పటికీ ఇబ్బందులు తలెత్తలేదు. ట్రాన్స్​ఫార్మర్లను లైన్లతో సహా ఎత్తైన ప్రదేశానికి షిప్ట్ చేశాం. ఇక ఈసారి వర్షాలు, వరదలకు గ్రామీణ జిల్లాలు, సర్కిళ్ల పరిధిలో 13 విద్యుత్ స్తంభాలు నేలకొరగటంతో పాటు... అయిదు డిస్ట్రీబ్యూషన్ ట్రాన్స్​ఫార్మర్లు దెబ్బతిన్నాయి.

ప్రశ్న: మరో మూడు నాలుగేళ్లలో స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయాలని కేంద్రం పేర్కొంది. వాటివల్ల డిస్కంలకు ఆర్థిక భారమవుతుందని భావిస్తున్నారా...?

జవాబు: ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేశాం. ఇప్పటికీ ఒక్క స్మార్ట్ మీటర్ పెట్టని రాష్ట్రాలు కూడా కొన్ని ఉన్నాయి. అటువంటి రాష్ట్రాల్లో ప్రీపెయిడ్​మోడ్​లో అడ్వాన్స్ చెల్లింపులు జరిగితే బాగుంటుందని సూచన చేశారు. అది మంచి నిర్ణయమే. డిస్కంలకు వినియోగదారులు సరైన సమయంలో బిల్లులు చెల్లించడంలేదు. దానివల్ల డిస్కంలకు కాస్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముందే చెల్లిస్తే విద్యుత్ సంస్థలకు వెసులుబాటు ఉంటుంది. అన్ని మీటర్లను ప్రీపెయిడ్ మోడ్ లో చేయడం ఖర్చుతో కూడుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రీపెయిడ్ మీటర్ల ఏర్పాటుకు రూ.11,500ల కోట్ల నిధులు అవసరమవుతాయి. కాబట్టి కేంద్రం ఏదైనా స్కీం తీసుకొచ్చి.. తద్వారా 80శాతం నుంచి 90శాతం వరకు గ్రాంట్ ఇస్తే.. డిస్కంలకు ఆర్థికంగా భారం కాకుండా ఉంటుంది.

ప్రశ్న: గతేడాది రికార్డ్ స్థాయిలో హైడల్ విద్యుత్​ను ఉత్పత్తి చేశాం. ఈసారి హైడల్ విద్యుత్ ఉత్పత్తి ఎలా కొనసాగుతుంది. గతేడాదిని మించి ఈసారి విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశాలు ఉన్నాయా..?

జవాబు (ప్రభాకర్ రావు , ట్రాన్స్ కో -జెన్కో సీఎండీ): ఈ ఏడాది వర్షాలు భారీగానే కురిసాయి. టార్గెట్​కు మించే విద్యుత్​ను ఉత్పత్తి చేశాం. వర్షాకాలం మరో రెండు మూడు నెలలు ఉంది. గత వారంలో దేశంలో విద్యుత్ కొరత ఉంది. అయినప్పటికీ మనకు హైడల్ విద్యుత్ ఉత్పత్తి ఉంది కాబట్టి... రిజర్వాయర్లలో ఇన్ ఫ్లో బాగానే ఉంది. కాబట్టి విద్యుత్​ను ఉత్పత్తి చేస్తున్నాం. నాగార్జున సాగర్, పోచంపాడ్, జూరాల, పులిచింతల వంటి హైడల్ ఉత్పత్తి కేంద్రాలలో కలిపి 2,441 హైడల్ విద్యుత్ ఉత్పత్తి కావాల్సి ఉంది. వీటిలో పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం. థర్మల్ పవర్ కూడా పీఎల్ఎఫ్​లో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నాం.

ప్రశ్న: ఈసారి 215 మిలియన్ యూనిట్ల విద్యుత్​ను ఎక్సేంజ్​లో అమ్మారు.. అదెలా సాధ్యమైంది...?

జవాబు: హైడల్, థర్మల్ ప్రాజెక్టులను నడుపుతూ... విద్యుత్ కొరత ఉన్న సమయంలో విద్యుత్​ను అమ్మి... విద్యుత్ సంస్థకు కొంత ఆర్థికంగా వెసులుబాటు కల్పించుకున్నాం. రాష్ట్ర పవర్​సెక్టార్​కు కొంత సాయమైంది. గత నెలలో 215 మిలియన్ యూనిట్ల విద్యుత్​ను ఎక్సేంజ్​లో అమ్మగలిగాం. తద్వారా సుమారు రూ.115 కోట్ల ఆదాయం వచ్చింది.

ప్రశ్న: భారీ వర్షాల నేపథ్యంలో పవర్ ప్లాంట్లలోకి నీళ్లు వచ్చి చేరిన ఘటనలు ఏమైనా చోటు చేసుకున్నాయా...?

జవాబు: కొత్తగూడెం పాల్వంచలో భారీ వర్షం కురిసింది. 18 సెంమీల వర్షాపాతం నమోదైంది. విద్యుత్ ప్లాంట్​ను ఆనుకుని కరకవాగు ఉంది. ప్లాంట్​లోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. వెంటనే ఇంజినీర్లు అప్రమత్తమై కాంపౌండ్ గోడను కూల్చివేసి..... నీటిని బయటకు పంపించారు. దీంతో ప్లాంట్​కు ఎటువంటి ఇబ్బందికలగలేదు. ప్రస్తుతం పాల్వంచలో విద్యుత్ ఉత్పత్తి సాధారణంగానే కొనసాగుతుంది.

ప్రశ్న: విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే అవసరమైన బొగ్గు అందుబాటులో ఉండాలి. నిరంతరంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బొగ్గు నిల్వల పరిస్థితి ఏవిధంగా ఉంది...?

జవాబు: ఇప్పటికే సీఎం కేసీఆర్... బొగ్గు నిల్వలకు సంబంధించి విద్యుత్ శాఖకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అవసరమైన బొగ్గును అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. దీంతో విద్యుత్ శాఖ అప్రమత్తమై 15 రోజులకు సరిపడా బొగ్గును అందుబాటులో ఉంచుకుంది. మన రాష్ట్రంలో అత్యధిక బొగ్గు ఓపెన్ కాస్ట్​ల ద్వారా ఉత్పత్తి కావడం వల్ల తడి బొగ్గు వస్తుంది. దీంతో కాస్త ఇబ్బంది అవుతుంది.

ఇదీ చూడండి: Power Purchase: 'కరెంట్​ను స్వేచ్ఛగా కొనుక్కునేందుకు వెసులుబాటు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.