మంత్రి కేటీఆర్ను భారత క్రికెటర్ హనుమవిహారి ప్రగతి భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. కేటీఆర్కు విహారి పుష్పగుచ్ఛం ఇచ్చి నమస్కరించారు. అనంతరం విహారిని మంత్రి శాలువాతో సత్కరించారు. వారితో ఎమ్మెల్సీ కాసిరెడ్డి నారాయణరెడ్డి కూడా సమావేశమయ్యారు.
![cricketer hanuma vihari, minister ktr](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10286560_img-20210118-wa0057.jpg)
క్రికెట్ సంబంధిత అంశాలపై కేటీఆర్, విహారి సరదాగా కాసేపు ముచ్చటించారు. అనంతరం విహారికి మంత్రి బ్యాట్ను బహుకరించారు. మంత్రిని కలిసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ విహారి ట్వీట్ చేశారు.
![cricketer hanuma vihari, minister ktr](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10286560_img-20210118-wa0056.jpg)
ఇదీ చదవండి: 'దేశాన్ని ఆత్మనిర్భర్గా మార్చేందుకు యువత ప్రతిభ అవసరం'