ETV Bharat / state

రాగల మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు

author img

By

Published : Oct 8, 2020, 6:25 PM IST

రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

రాగల మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు
రాగల మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు

రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆదిలాబాద్‌, కుమురం భీం, నిర్మల్‌, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, జనగామ, వరంగల్‌ పట్టణ, గ్రామీణ, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

తెలంగాణ పరిసర ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వెల్లడించింది. ఈ ఆవర్తనం నుంచి దక్షిణ తమిళనాడు వరకు రాయలసీమ మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడిందని పేర్కొంది. దక్షిణ కోస్తాంధ్ర దాని పరిసర ప్రాంతాల్లో 1.5 కిలో మీటర్ల నుంచి 3.1కి లో మీటర్ల ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది.

శుక్రవారం ఉత్తర అండమాన్‌ సముద్రం దానిని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ప్రకటించింది. ఇది 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని సూచించింది.

అనంతరం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఉత్తర ఆంధ్రప్రదేశ్‌ దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఒరిస్సా తీరాలలో 11న మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో వాయుగుండంగా తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఇదీ చదవండి: సిలిండర్ల దొంగ దొరికాడు

రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆదిలాబాద్‌, కుమురం భీం, నిర్మల్‌, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, జనగామ, వరంగల్‌ పట్టణ, గ్రామీణ, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

తెలంగాణ పరిసర ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వెల్లడించింది. ఈ ఆవర్తనం నుంచి దక్షిణ తమిళనాడు వరకు రాయలసీమ మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడిందని పేర్కొంది. దక్షిణ కోస్తాంధ్ర దాని పరిసర ప్రాంతాల్లో 1.5 కిలో మీటర్ల నుంచి 3.1కి లో మీటర్ల ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది.

శుక్రవారం ఉత్తర అండమాన్‌ సముద్రం దానిని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ప్రకటించింది. ఇది 24 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని సూచించింది.

అనంతరం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఉత్తర ఆంధ్రప్రదేశ్‌ దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఒరిస్సా తీరాలలో 11న మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో వాయుగుండంగా తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

ఇదీ చదవండి: సిలిండర్ల దొంగ దొరికాడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.