హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగుతోంది.‘హైదరాబాద్’ స్థానంలో పూర్తయిన ఏడో రౌండ్లలో తెరాస, భాజపా మధ్య పోటీ ఉత్కంఠ పోరు సాగుతోంది.ఏడో రౌండ్ ముగిసే సరికి తెరాస అభ్యర్థి వాణీదేవి సమీప భాజప అభ్యర్థి రామచందర్రావుపై 8,021 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు.
ఆరు రౌండ్లలో సురభి వాణీదేవికి 1,12,689 ఓట్లు, భాజపా అభ్యర్థి రాంచందర్రావుకు 1,04,668, స్వతంత్ర అభ్యర్థి ప్రొ.నాగేశ్వర్కు 53,610, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 31,554, తెదేపా అభ్యర్థి ఎల్.రమణకు 5,973 ఓట్లు పోలయ్యాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మెజారిటీ ఎవరికీ వచ్చే అవకాశం లేదని అధికారులంటున్నారు. రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు తప్పనిసరి అని, మూడో ప్రాధాన్య ఓట్లని కూడా లెక్కించే అవకాశం లేక పోలేదని అధికారులు అంటున్నారు. అదే జరిగితే శనివారం రాత్రికి తుది ఫలితాలు వెలువడవచ్చని అంచనా వేస్తున్నారు.ఏడు రౌండ్ తర్వాత 21,309 ఓట్లు చెల్లుబాటు కాలేదు.
క్రమ సంఖ్య | అభ్యర్థులు | ఓట్లు |
1 | వాణీదేవి | 1,12,689 |
2 | రాంచందర్రావు | 1,04,668 |
3 | ప్రొ.నాగేశ్వర్ | 53,610 |
4 | చిన్నారెడ్డి | 31,554 |
5 | ఎల్.రమణ | 5,973 |