ETV Bharat / state

GHMC ROADS: హైదరాబాద్​ రోడ్లు.. ఇసుక, కంకరతో అస్తవ్యస్తం.!

author img

By

Published : Sep 13, 2021, 1:00 PM IST

రాజధానిలో రోడ్ల నిర్వహణ అగమ్యగోచరంగా మారింది. ఎప్పుడూ బిజీబిజీగా ఉండే నగర రహదారులపై భవన నిర్మాణ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ఫలితంగా ద్విచక్రవాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. భారీ ఎత్తున భవన నిర్మాణాలు చేపడుతున్న బడా నిర్మాణదారులు నిబంధనలు ఉల్లంఘిస్తూ రోడ్లపై ఇసుక, కంకరను విచ్చలవిడిగా పోస్తున్నారు. దీనిపై ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు కఠిన చర్లు తీసుకోకపోవడమే ఇందుకు కారణం.

ghmc roads
ప్రమాదకరంగా హైదరాబాద్​ రోడ్లు

జీహెచ్‌ఎంసీ(GHMC) నిర్లక్ష్యం ప్రాణాల మీదకు తెస్తోంది. రహదారులపై ఇసుక, కంకర మేట వేస్తుండడంతో ద్విచక్ర వాహనదారులు కిందపడుతున్నారు. రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్లను బల్దియా అధికారులు గాలికొదిలేయడం వల్లే ఈ దురవస్థ. హైటెక్‌సిటీ మైండ్‌స్పేస్‌ కూడలి వద్ద శుక్రవారం సినీనటుడు సాయిధరమ్‌తేజ్‌ ప్రమాదం బారిన పడిన తీరు ఆ విషయాన్ని స్పష్టం చేస్తోంది. రూ.200 కోట్లతో నిర్మించిన తీగల వంతెన, రూ.130కోట్లతో చక్కదిద్దిన మైండ్‌స్పేస్‌ కూడలి, రూ.160కోట్లతో అభివృద్ధి చేసిన మైండ్‌స్పేస్‌కూడళ్ల మధ్యనున్న రోడ్లపైనే ఇసుక, కంకర వ్యర్థాలు పేరుకుపోతున్నాయంటే.. ఇతర ప్రాంతాల పరిస్థితి వేరే చెప్పనక్కర్లేదు.

ghmc roads
ఆటోనగర్‌ వద్ద వాహనదారుల కళ్లలో పడుతున్న దుమ్ము

కార్పొరేటర్లు వద్దన్నారని..

జీహెచ్‌ఎంసీ చట్టం ప్రకారం రహదారులను ధ్వంసం చేస్తున్న సంస్థలు లేదా వ్యక్తులకు జరిమానా విధించవచ్చు. నిర్మాణ పనులు జరిగే ప్రాంతాల్లో ఇసుక, కంకర, కట్టెలు, రేకులు, ఇనుప కడ్డీలను ఉంచడం వంటి చర్యలకు పాల్పడితే మొదటిసారి రూ.25 వేలు, రెండోసారి రూ.50 వేలు జరిమానా వేయొచ్చు. మూడోసారీ ఉల్లంఘనకు పాల్పడితే.. ఆ నిర్మాణాన్ని సీజ్‌ చేసే అధికారం ఉంది. అందుకోసం 400 మంది సిబ్బందితో రెండేళ్ల క్రితం జీహెచ్‌ఎంసీ ప్రత్యేకంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాన్ని ఏర్పాటు చేసింది. కొంతకాలం ఆ విభాగం నగరవ్యాప్తంగా తిరుగుతూ చాలా మందికి జరిమానా విధించింది. ఫిబ్రవరి 8, 2020న జరిగిన బల్దియా సర్వసభ్య సమావేశంలో దీనిపై చర్చ జరిగింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు బడా నిర్మాణదారుల ఉల్లంఘనలను పట్టించుకోకుండా, బస్తీల్లో జరిగే నిర్మాణ పనుల వద్ద జరిమానాలు వేస్తున్నారని కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే.. అప్పట్నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం జరిమానాలు విధించడం మానేసింది. మూతలేని ట్రాలీల్లో బండరాళ్లను తరలించే టిప్పర్లనూ అధికారులు అడ్డుకోవట్లేదు.

ghmc roads
కోఠి ఆంధ్రా బ్యాంక్‌ ఎదుట కంకర తేలిన రోడ్డు

పనిచేయని యంత్రాలు

నగరంలో రహదారుల నిర్వహణ ప్రమాదకరంగా తయారైంది. చిలకలగూడ కూడలిలో అడుగు మందం మేర కంకర పేరుకుపోయింది. కవాడిగూడ రోడ్డులో ఏడాదిగా పైపులైను కోసం తీసిన మట్టిని తీయలేదు. మెహిదీపట్నం నుంచి ఎల్బీనగర్‌ వరకు ఉన్న ఇన్నర్‌ రింగు రోడ్డు మీద అడుగడుగునా ఇసుక మేటలు కనిపిస్తున్నాయి. మైండ్‌స్పేస్‌కూడలి, ఇనార్బిట్‌మాల్‌, బయోడైవర్సిటీ కూడలి, ఖాజాగూడ కూడలి, శిల్పాలేఅవుట్‌, గచ్చిబౌలి, కొండాపూర్‌, మాదాపూర్‌ రోడ్లపైనా ఇసుక, కంకర వ్యర్థాలు పడుతున్నాయి. వర్షాలొచ్చినప్పుడు ఆ పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుంది. నిబంధనల ప్రకారం.. మరుసటి రోజు లేదా అదే రోజు రాత్రి బల్దియా ఆ వ్యర్థాలను పూర్తిగా తొలగించాలి. వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఏటా రూ.35కోట్ల అద్దె తీసుకుంటున్న 18 ఊడ్చే యంత్రాలు ఉత్సవ విగ్రహాల్లా మారడం వల్లే దుస్థితి తలెత్తిందన్న విమర్శలొస్తున్నాయి. డీజిల్‌ మిగిలించుకునేందుకు డ్రైవర్లు ఊడ్చే యంత్రాలను తూతూ మంత్రంగా నడిపిస్తున్నారు. ఇసుక, కంకర, ఇతర వ్యర్థాలను లోపలికి పీల్చుకునే పరికరాలను ఆపేసి రోడ్లపై తిప్పుతున్నారని, అధికారులు తనిఖీలు చేయకుండా బిల్లులు మంజూరు చేస్తున్నారని ఆరోపణలొస్తున్నాయి.

ఇదీ చదవండి: Sitakka: 'ప్రభుత్వం కలెక్టర్​ను పంపి.. చేతులు దులుపుకుంది'

జీహెచ్‌ఎంసీ(GHMC) నిర్లక్ష్యం ప్రాణాల మీదకు తెస్తోంది. రహదారులపై ఇసుక, కంకర మేట వేస్తుండడంతో ద్విచక్ర వాహనదారులు కిందపడుతున్నారు. రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్లను బల్దియా అధికారులు గాలికొదిలేయడం వల్లే ఈ దురవస్థ. హైటెక్‌సిటీ మైండ్‌స్పేస్‌ కూడలి వద్ద శుక్రవారం సినీనటుడు సాయిధరమ్‌తేజ్‌ ప్రమాదం బారిన పడిన తీరు ఆ విషయాన్ని స్పష్టం చేస్తోంది. రూ.200 కోట్లతో నిర్మించిన తీగల వంతెన, రూ.130కోట్లతో చక్కదిద్దిన మైండ్‌స్పేస్‌ కూడలి, రూ.160కోట్లతో అభివృద్ధి చేసిన మైండ్‌స్పేస్‌కూడళ్ల మధ్యనున్న రోడ్లపైనే ఇసుక, కంకర వ్యర్థాలు పేరుకుపోతున్నాయంటే.. ఇతర ప్రాంతాల పరిస్థితి వేరే చెప్పనక్కర్లేదు.

ghmc roads
ఆటోనగర్‌ వద్ద వాహనదారుల కళ్లలో పడుతున్న దుమ్ము

కార్పొరేటర్లు వద్దన్నారని..

జీహెచ్‌ఎంసీ చట్టం ప్రకారం రహదారులను ధ్వంసం చేస్తున్న సంస్థలు లేదా వ్యక్తులకు జరిమానా విధించవచ్చు. నిర్మాణ పనులు జరిగే ప్రాంతాల్లో ఇసుక, కంకర, కట్టెలు, రేకులు, ఇనుప కడ్డీలను ఉంచడం వంటి చర్యలకు పాల్పడితే మొదటిసారి రూ.25 వేలు, రెండోసారి రూ.50 వేలు జరిమానా వేయొచ్చు. మూడోసారీ ఉల్లంఘనకు పాల్పడితే.. ఆ నిర్మాణాన్ని సీజ్‌ చేసే అధికారం ఉంది. అందుకోసం 400 మంది సిబ్బందితో రెండేళ్ల క్రితం జీహెచ్‌ఎంసీ ప్రత్యేకంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాన్ని ఏర్పాటు చేసింది. కొంతకాలం ఆ విభాగం నగరవ్యాప్తంగా తిరుగుతూ చాలా మందికి జరిమానా విధించింది. ఫిబ్రవరి 8, 2020న జరిగిన బల్దియా సర్వసభ్య సమావేశంలో దీనిపై చర్చ జరిగింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు బడా నిర్మాణదారుల ఉల్లంఘనలను పట్టించుకోకుండా, బస్తీల్లో జరిగే నిర్మాణ పనుల వద్ద జరిమానాలు వేస్తున్నారని కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే.. అప్పట్నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం జరిమానాలు విధించడం మానేసింది. మూతలేని ట్రాలీల్లో బండరాళ్లను తరలించే టిప్పర్లనూ అధికారులు అడ్డుకోవట్లేదు.

ghmc roads
కోఠి ఆంధ్రా బ్యాంక్‌ ఎదుట కంకర తేలిన రోడ్డు

పనిచేయని యంత్రాలు

నగరంలో రహదారుల నిర్వహణ ప్రమాదకరంగా తయారైంది. చిలకలగూడ కూడలిలో అడుగు మందం మేర కంకర పేరుకుపోయింది. కవాడిగూడ రోడ్డులో ఏడాదిగా పైపులైను కోసం తీసిన మట్టిని తీయలేదు. మెహిదీపట్నం నుంచి ఎల్బీనగర్‌ వరకు ఉన్న ఇన్నర్‌ రింగు రోడ్డు మీద అడుగడుగునా ఇసుక మేటలు కనిపిస్తున్నాయి. మైండ్‌స్పేస్‌కూడలి, ఇనార్బిట్‌మాల్‌, బయోడైవర్సిటీ కూడలి, ఖాజాగూడ కూడలి, శిల్పాలేఅవుట్‌, గచ్చిబౌలి, కొండాపూర్‌, మాదాపూర్‌ రోడ్లపైనా ఇసుక, కంకర వ్యర్థాలు పడుతున్నాయి. వర్షాలొచ్చినప్పుడు ఆ పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుంది. నిబంధనల ప్రకారం.. మరుసటి రోజు లేదా అదే రోజు రాత్రి బల్దియా ఆ వ్యర్థాలను పూర్తిగా తొలగించాలి. వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఏటా రూ.35కోట్ల అద్దె తీసుకుంటున్న 18 ఊడ్చే యంత్రాలు ఉత్సవ విగ్రహాల్లా మారడం వల్లే దుస్థితి తలెత్తిందన్న విమర్శలొస్తున్నాయి. డీజిల్‌ మిగిలించుకునేందుకు డ్రైవర్లు ఊడ్చే యంత్రాలను తూతూ మంత్రంగా నడిపిస్తున్నారు. ఇసుక, కంకర, ఇతర వ్యర్థాలను లోపలికి పీల్చుకునే పరికరాలను ఆపేసి రోడ్లపై తిప్పుతున్నారని, అధికారులు తనిఖీలు చేయకుండా బిల్లులు మంజూరు చేస్తున్నారని ఆరోపణలొస్తున్నాయి.

ఇదీ చదవండి: Sitakka: 'ప్రభుత్వం కలెక్టర్​ను పంపి.. చేతులు దులుపుకుంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.