హజ్యాత్రకు వెళ్లే వారి కోసం ఆన్లైన్ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. నాంపల్లిలోని హజ్హౌజ్లో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కేంద్రం
ఏర్పాటు చేశారు. హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ ప్రభాకర్తో కలిసి ప్రారంభించారు. వక్ఫ్బోర్డుకు సంబంధించి హజ్హౌస్లో నిర్మాణంలో ఉన్న భవనాలను వారు పరిశీలించారు. హజ్ యాత్రకు వెళ్లే వారికి ప్రభుత్వం ఎంతో ప్రాముఖ్యత ఇస్తోందని హోంమంత్రి తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు గుర్తు చేశారు. నెల రోజుల పాటు దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ చివరి వారంలో డ్రా తీస్తున్నట్లు హోంమంత్రి వెల్లడించారు. ఈ ఏడాది 70 ఏళ్లు లోపు ఉన్నవారికే దరఖాస్తు చేసుకునే అవకాశముందని హోంమంత్రి పేర్కొన్నారు.
ఇదీ చూడండి: "మైనార్టీల్లో ఐఏఎస్, ఐపీఎస్ల సంఖ్య పెరగాలి"