మూడు రోజులుగా వర్షంలో తడుస్తున్న ఓ వ్యక్తిని కాపాడిన పోలీసు సిబ్బందిని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ప్రశంసించారు. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో గత మూడు రోజులుగా వానలో తడుస్తూ ఓ దుకాణం వద్ద కూర్చున్న ఓ వ్యక్తి వద్దకు పోలీసు సిబ్బంది వెళ్లారు. తన వివరాలు ఏమీ చెప్పలేని పరిస్థితులు ఉన్న అతనిని కానిస్టేబుల్ మహేష్, హోం గార్డు ఎండీ సయీద్ రక్షించారు.
108 వాహనానికి సమాచారం ఇచ్చి.. అతనిని ఆ వాహనం ద్వారా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించినందుకు మహమూద్ అలీ వారికి అభినందనలు తెలిపారు. పోలీసు సిబ్బంది శాంతిభద్రతలు కాపాడడంతోపాటు ఇలా సేవ చేయడం మంచి పద్ధతి అని హోంమంత్రి చెప్పారు.
ఇదీ చూడండి : పాఠశాలల పునఃప్రారంభం, విద్యాబోధనపై సీఎం కేసీఆర్ కీలక సమీక్ష